టి20 ఫార్మాట్లో.. భారత్ ఛేదించిన అత్యధిక టార్గెట్లు ఇవే?
అయితే అటు ఆస్ట్రేలియా జట్టులో మాత్రం దాదాపుగా వరల్డ్ కప్ లో ఆడిన ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు అని చెప్పాలి ఇక ఎంతో అనుభవం ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లతో తలబడి యంగ్ టీమ్ ఇండియా ప్లేయర్లు ఎలా రాణిస్తారు అని అందరూ అనుకున్నప్పటికీ ఏకంగా భారీ స్కోరు చేసి విజయం సాధించారు. 209 పరుగుల టార్గెట్ ను చేదించి రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఈ క్రమంలోనే t20 ఫార్మాట్లో ఇప్పటివరకు భారత జట్టు చేదించిన అత్యధిక పరుగుల టార్గెట్స్ ఏంటి అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.
ఆ వివరాలు తెలుసుకునేందుకు అటు అభిమానులు అందరూ కూడా తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆ వివరాలు చూసుకుంటే.. ఇటీవలే ఆస్ట్రేలియా తో విశాఖ వేదికగా జరిగిన.. టి20 మ్యాచ్ లో భారత జట్టు చేదించిన 209 పరుగుల టార్గెట్ పొట్టి ఫార్మాట్లో టీమ్ ఇండియాకు అత్యధిక టార్గెట్గా కొనసాగుతుంది. తర్వాత 2019లో హైదరాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 208 టార్గెట్, 2009లో మొహాలీ వేదికగా శ్రీలతతో జరిగిన మ్యాచ్లో 207 పరుగులు, 2020లో ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 204రన్స్, 2013లో రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 202పరుగులు ఇప్పుడు వరకు టీమిండియా ఛేదించిన అత్యధిక టార్గెట్స్ లిస్ట్ లో ఉన్నాయి.