ఓటమి రుచి చూపిస్తాం.. బావుమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
ప్రతిష్టాత్మకమైన వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా నేడు ఒక సంచలనమైన పోరుకు సమయం ఆసన్నమైంది అన్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్ లలో కూడా విజయం సాధించి ఫుల్ జోష్ లో ఉంది టీమ్ ఇండియా. సొంత గడ్డపై ఎంతో పటిష్టంగా కనిపిస్తూ ప్రత్యర్థులను భయపెడుతుంది అని చెప్పాలి. అదే సమయంలో ఇక భారీ స్కోర్లు నమోదు చేస్తూ సంచలన విజయాలను సాధిస్తూ దూసుకు పోతుంది సౌత్ ఆఫ్రికా. ఈ రెండు టీమ్స్ మధ్య నేడు మ్యాచ్ జరగబోతుంది. అయితే వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న టీమ్ ఇండియాకు ఓటమి రుచి చూపిస్తాం అంటూ దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ బావుమా అన్నాడు.

 కాగా ప్రస్తుతం టీమిండియా 14 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానంలో నిలవడంతో పాటు ఇప్పటికే సెమీఫైనల్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది. అయితే ఇటీవల  అధికారికంగా సౌత్ ఆఫ్రికా కూడా సెమీఫైనల్కు క్వాలిఫై అయిపోయింది. కాగా నేడు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఈ క్రమంలోనే మ్యాచ్ కు ముందు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బావుమా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో పరాజయం లేకుండా దూసుకుపోతున్న భారత రికార్డును బ్రేక్ చేస్తాం.

 సొంత గడ్డపై భారత్ ఎంతో పటిష్టమైన ప్రత్యర్థి. అయినప్పటికీ మా దగ్గర తగిన వ్యూహాలు ఉన్నాయి. వాటిని మైదానంలో ఆచరణలో పెడతాం. తప్పకుండా భారత్ పై విజయం సాధిస్తామని నమ్మకం ఉంది అంటూ బావుమా చెప్పుకొచ్చాడు. కాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ కి దాదాపు 80000 మంది అభిమానులు హాజరు కాబోతున్నారు. అయితే జన సందోహం ముందు ఆడటం ఎవరికైనా ఇష్టమే  అందులో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు  ఇంకా చెప్పాలంటే అది మమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తుంది. స్టేడియం మొత్తం బ్లూ జెర్సీలు నిండిపోతాయని మాకు తెలుసు. అయినా మా ప్రణాళిక అమలు చేస్తే తప్పక విజయం సాధిస్తాం అంటూ చెప్పుకొచ్చాడు బావుమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: