రోహిత్ ముందు అత్యంత అరుదైన రికార్డు.. మరో 47 పరుగులు చేస్తే?

praveen
ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ టోర్నీలో రోహిత్ సేన ఇక అక్టోబర్ 29వ తేదీన ఇంగ్లాండ్ జట్టుతో ఆరో మ్యాచ్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే  ఇప్పటికే ఆడిన ఐదు మ్యాచ్లలో కూడా విజయం సాధించి ఓటమి ఎరుగని జట్టుగా ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది భారత జట్టు. అన్ని విభాగాల్లో కూడా పటిష్టంగా కనిపిస్తూ ప్రతి మ్యాచ్ లో కూడా ప్రత్యర్ధిని చిత్తు చేస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఇలా జట్టు ప్రదర్శనే కాదు.. రోహిత్ వ్యక్తిగత ప్రదర్శన కూడా అభిమానులు అందరిని ఆనందంలో ముంచేస్తుంది. వరల్డ్ కప్ లో సూపర్ ఫామ్ ను కనపరుస్తున్నాడు రోహిత్ శర్మ.


 ఓపెనర్ గా బరిలోకి దిగుతూ భారత జట్టుకు ప్రతి మ్యాచ్ లో కూడా మంచి ఆరంభాలను అందిస్తూ ఉన్నాడు అని చెప్పాలి  అయితే ఇక ఇప్పుడు రోహిత్ శర్మ ముందు ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది.. రేపు ఇంగ్లాండుతో జరగబోయే మ్యాచ్లో రోహిత్ శర్మ మరో 47 పరుగులు చేశాడు అంటే చాలు తన పేరిట ఒక ప్రత్యేకమైన రికార్డు వచ్చి చేరుతుంది. అంతర్జాతీయ క్రికెట్లో 18 వేల పరుగుల మార్కును అందుకుంటాడు రోహిత్. అయితే ఇప్పుడు వరకు జరిగిన మ్యాచ్ లలో రోహిత్ ఫామ్ చూసుకుంటే ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్లో ఎంతో సులభంగా 47 పరుగులు చేయగలడు అని అభిమానులు కూడా భావిస్తూ ఉన్నారు.


 కాగా 450 అంతర్జాతీయ మ్యాచ్ లలో  43.96 సగటుతో 17,953 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. అందులో 45 సెంచరీలు, 98 ఆర్థ సెంచరీలు ఉన్నాయి. ఇక రోహిత్ బ్యాట్ నుంచి 1703 ఫోర్లు, 568 సిక్సర్లు కూడా వచ్చాయి అని చెప్పాలి.  అయితే ఇప్పుడు వరకు కేవలం నలుగురు భారత బ్యాట్స్మెన్లు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్లో 18 వేల పరుగుల మార్కులు అందుకున్నారు. రోహిత్ శర్మ ఇప్పుడు ఆ రికార్డు సాధిస్తే ఐదో భారత బ్యాట్స్మెన్ గా అవతరించబోతున్నాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్, సౌరబ్ గంగూలీ మాత్రమే 18వేల పరుగుల మార్క్ అందుకున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: