హార్డిక్ ను అడ్డుపెట్టుకుని.. ధోనీపై సెటైర్ వేసిన ఇర్పాన్ పఠాన్?

praveen
ప్రస్తుతం టీమిండియా వెస్డిండీస్ టూర్‌లో ఉంది. ఇప్పటికే టెస్ట్ మ్యాచ్‌లు, వన్డే సిరీస్ పూర్తి అవ్వగా.. ప్రస్తుతం ఐదు టీ 20ల సిరీస్ కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు టీ20లు పూర్తవ్వగా.. తొలి రెండు టీ20 మ్యాచ్‌లలో టీమిండియాను వెస్టిండీస్ ఓడించింది. కీలకమైన మూడో టీ20లో టీమిండియా గెలవడంతో సిరీస్ ఆశలు సజీవంగా నిలిచాయి. అయితే మూడో టీ20లో కెప్టెన్ హర్దిక్ పాండ్యా ఆటతీరుపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో అతడి ఆటతీరుపై ట్రోలింగ్స్ వస్తున్నాయి.

ఈ క్రమంలో హర్దిక్ పాండ్యా ఆటపై టీమిండియా మాజీ క్రికెటర్లు కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా హర్దిక్ ని అడ్డుపెట్టుకుని ధోనీని  ఇర్పాన్ పఠాన్ ట్రోల్ చేశాడు. మూడో టీ20లో తిలక్ వర్మ 49 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రెండు పరుగులు చేస్తే విజయం సొంతం చేసుకునే క్రమంలో హార్థిక్ పాండ్యా సిక్స్ కొట్టడంతో మ్యాచ్ పినిష్ అయింది. దీని వల్ల తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. దీంతో సెల్పీష్ కెప్టెన్ అంటూ హర్ధిక్ పాండ్యాపై చాలామంది విమర్శలు చేస్తున్నారు. ఓవర్ కి ముందు చివరిదాకా ఉండి మ్యాచ్ పినిష్ చేయాలని తిలక్ వర్మకు పాండ్యా చెప్పాడు.

అయితే పాండ్యా చెప్పడం వల్ల తిలక్ శర్మ భారీ షాట్లు ఆడలేదు. హార్దిక్ సింగిల్ తీసి ఇస్తే తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసుకునే అవకాశం లభించేది. కానీ హార్ధిక్ కావాలనే తిలక్ వర్మకు ఛాన్ ఇవ్వలేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ఇర్పాన్ పఠాన్ కూడా ట్రోల్ చేశాడు. 'కష్టమైన పని మీరు  చేయండి... తేలికైన పని నేను తీసుకుంటా.. ఇది ఎక్కడో విన్నట్టుంది కదు' అంటూ పోస్ట్చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్ లో గంభీర్, కోహ్లీ, యువరాజు సింగ్ బాగా ఆడగా.. చివరిలో ధోనీ వచ్చి సిక్స్ కొట్టి మ్యాచ్ ని పినిష్ చేశాడు. దీంతో ధోనీకి మంచి పేరు వచ్చింది. దీంతో హార్డిక్ పాండ్యా తీరును గుర్తు చేస్తూ ధోనీని ఇర్పాన్ పఠాన్ ట్రోల్ చేసినట్లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: