ఇండియా vs పాక్ మ్యాచ్.. ఆస్పత్రిలో బెడ్స్ బుక్ చేస్తున్న ప్రేక్షకులు?
ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ జరిగిందంటే చాలు అప్పుడు రేటింగ్స్ కూడా రికార్డులు బద్దలు కొడుతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఈ ఏడాది అటు భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కి ఉన్న క్రేస్ దృశ్య.. ఇక అహ్మదాబాద్ లో ఉన్న హోటల్ రెంట్స్ అన్ని కూడా ఒకసారి గా పెరిగిపోయాయి.
అంతేకాదు మైదానం చుట్టుపక్కల ఉన్న హోటల్స్ అన్నీ కూడా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి అని చెప్పాలి. దీంతో బయట ప్రాంతాల నుంచి అహ్మదాబాద్ వచ్చే అభిమానులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. మ్యాచ్ సమయానికి హోటల్స్ కు బదులు ఆసుపత్రిలో బెడ్ బుక్ చేసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక పడకని రిజర్వ్ చేస్తే.. సమగ్ర వైద్య పరీక్షలు చేయించుకుంటామని అభిమానులు చెబుతున్నారు. దీంతో అటు మ్యాచ్ కి వెళ్లొచ్చు. వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. కాగా ఆసుపత్రిలో పరిమిత బెడ్స్ మాత్రమే ఉంటాయి. మొదట రోగులకి మా ప్రాధాన్యమని అహ్మదాబాద్ ఆసుపత్రి వైద్యుడు తెలిపాడు.