ఐపీఎల్ లో సంపాదించుకుంటే తప్పేంటి : విండీస్ లెజెండ్
భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించే ఐపిఎల్ వల్లే అటు అంతర్జాతీయ క్రికెట్ పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అంటూ ఎంతో మంది మాజీ ప్లేయర్లు అభిప్రాయపడుతున్నారు. ఆటగాళ్లు ఇక ఐపీఎల్ లో వచ్చే ఆదాయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని.. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అంటూ ఎంతోమంది ఆరోపణలు చేస్తున్నారు. ఇలా ఐపిఎల్ టోర్నీ ద్వారానే ఎంతోమంది ప్లేయర్స్ రెస్టు రేకుండా నిర్విరామంగా క్రికెట్ ఆడుతూ గాయం బారిన పడి అంతర్జాతీయ క్రికెట్కు దూరం అవుతున్నారని.. తద్వారా ఏ టీం కూడా వరల్డ్ క్రికెట్లో సత్తా చాట లేక పోతుంది అంటూ అభిప్రాయపడుతున్నారు.
అయితే ఐపీఎల్ పై వస్తున్న విమర్శల గురించి వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోనాల్డో, మెస్సి లాంటి ఫుట్బాల్ ప్లేయర్లు ఫ్రాంచైజీ లీగ్ లలో ఆడి మిలియన్ల డబ్బులు సంపాదిస్తున్నప్పుడు.. క్రికెటర్లు ఐపీఎల్ లో సంపాదిస్తే తప్పేంటి అంటూ క్లైవ్ లాయిడ్ ప్రశ్నించాడు. ఐసీసీ టోర్నీలో క్రికెటర్లు విఫలం కావడానికి ఐపిఎల్ తో ముడి పెట్టడం సరికాదు అంటూ వ్యాఖ్యానించాడు. ఆటగాళ్లకు దేశం కంటే ఐపీఎల్ కి ప్రాముఖ్యత ఇస్తున్నారని అర్థం పర్ధం లేని వ్యాఖ్యలు చేయడం ఇప్పటికైనా మానుకోవాలి అంటూ సూచించాడు. కాగా ఇక ఇంగ్లాండ్ లెజెండరీ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ చేసిన కామెంట్లు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి.