ఆ నలుగురు శనిలా దాపురించారు.. టీమిండియాకు వరల్డ్ కప్ ఫసక్కేనా?

praveen
మరికొన్ని రోజుల్లో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లబోతుంది. అక్కడ మూడు ఫార్మాట్లలో కూడా సిరీస్ ఆడబోతుంది. అయితే ముందుగా టెస్ట్ సిరీస్ తో పర్యటన ప్రారంభించబోతుంది భారత జట్టు. ఇక ఆ తర్వాత వన్డే టి20 ఫార్మాట్లకు ప్రత్యేకమైన జట్లను కూడా ఎంపిక చేసింది బీసీసీఐ. ఇక ఐపీఎల్ హీరోస్ అయినా యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్ లకు భారత జట్టులో సెలక్షన్ కమిటీ చోటు కల్పించింది. అయితే వన్డే టెస్ట్ ఫార్మాట్ కి రోహిత్ కెప్టెన్ గా ఉండగా.. టెస్ట్ ఫార్మాట్ వైస్ కెప్టెన్  రహానే వన్డే ఫార్మాట్ కు హార్దిక్ పాండ్యా బాద్యతలు చేపట్టనున్నారు.



 అయితే బౌలింగ్ విభాగం విషయంలో అటు టీమ్ ఇండియా సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం మాత్రం ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేస్తుంది అని చెప్పాలి. ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్ పెట్టుకొని జట్టులో కీ బౌలర్లను ఎందుకు పక్కన పెట్టారు అని అందరూ చర్చించుకుంటున్నారు. అదే సమయంలో యంగ్ బౌలర్లకు ఎందుకు చాన్స్ ఇవ్వలేదని తిట్టిపోస్తున్నారు.  వెస్టిండీస్ పర్యటన కోసం ఫుల్ ఫామ్ లో ఉన్న షమిని సెలెక్ట్ చేయలేదు. దీంతో అతనికి విశ్రాంతి ఇచ్చారా పూర్తిగా ఉద్వాసన పలికార అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.



 అయితే మరికొన్ని రోజుల్లో బుమ్రా రానుండగా అతనితో కలిసి సిరాజ్, షమిలు ఫేస్ ఎటాకింగ్ బాధ్యతలను తీసుకుంటారని అందరూ అంచనా వేశారు. కానీ అంతకు ముందు బిసిసిఐ సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం  అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 100 ప్రపంచ కప్ కి ముందు వన్డే ఫార్మాట్లో టీమిండియా 12 మ్యాచ్లు మాత్రమే ఆడాల్సి ఉంది. డబ్ల్యూటీసి ఫైనల్ తర్వాత ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి కూడా దొరికింది. ఇలాంటి సమయంలో కీలక బౌలర్ షమిని పక్కన పెట్టడం ఏంటి అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అనుభవం లేని ప్లేయర్లు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చి ఇక ఫుల్ ఫామ్ లో ఉన్న ప్లేయర్లను పక్కన పెట్టడమే మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. టీమిండియా కు నలుగురు సెలక్టర్లు శనిలా దాపరించారని వాళ్ళు ఉన్నంతవరకు.. కూడా వరల్డ్ కప్ టీమిండియా గెలవడం కష్టమే అంటూ కొంతమంది ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: