ఐపీఎల్ హిస్టరీలో.. ఇలా జరగడం ఇదే మొదటిసారి?

praveen
2023 ఐపీఎల్ సీజన్  చివరి దశకు చేరుకుంది. నేడు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫైనల్ మ్యాచ్కు వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. అయితే వాస్తవంగా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గుజరాత్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల  ఫైనల్ మ్యాచ్ ఆదివారం రోజున సాయంత్రం ఏడు గంటలకు జరగాల్సి ఉంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఇక ఈ ఫైనల్ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తుంది అని చెప్పాలి. ఇరు జట్లు కూడా ఫైనల్ మ్యాచ్లో తలబడెందుకు అంత సిద్ధం చేసుకున్నాయి. కానీ ఇలాంటి సమయంలోనే వరుణుడు ఆటంకం సృష్టించాడు.

 వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమైంది. అయితే కాసేపు వర్షం తర్వాత మళ్లీ మ్యాచ్ ప్రారంభమవుతుందని ప్రేక్షకులందరూ ఊహించారు. ఇక మ్యాచ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా... అని ఇక వెయ్యి కళ్లతో చూడటం మొదలుపెట్టారు. కానీ వరుణ దేవుడు మాత్రం ఎంతకీ కరుణించలేదు. దీంతో ఇక మ్యాచ్ కనీసం కొన్ని ఓవర్లు కూడా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక చేసేదేమీ లేక రిఫరీలు మ్యాచ్ ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 ఇలా ఆదివారం రోజున జరగాల్సిన మ్యాచ్ పోస్ట్ పోన్ అయ్యి.. ఇక నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు జరగబోతుంది అని చెప్పాలి. ఇక నేడు కూడా వర్ష ప్రభావం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించగా.. ఏం జరుగుతుందో అని  అందరిలో మరింత ఉత్కంఠ పెరిగిపోయింది ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ రద్దవగా ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారి ఇలా జరిగింది. గత 15 సీజన్లలో ఏ ఫైనల్ మ్యాచ్ కి కూడా వర్షం అడ్డంకిగా మారలేదు. ఇక ఏ ఫైనల్ మ్యాచ్ కూడా వాయిదా పడలేదు. అయితే లీగ్ మ్యాచ్ లు, ప్లే ఆఫ్ మ్యాచ్ ల విషయంలో ఇలా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేయడం.. లేదా ఓవర్ ల ను కుదించి మ్యాచ్ కొనసాగించడం చేశారు. కానీ ఫైనల్ మ్యాచ్ విషయంలో మాత్రం మొదటిసారి ఇలా జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: