ఏంటి.. విరాట్ కోహ్లీ గాయం బారిన పడ్డాడా?
దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ఈ షాక్ తో పాటు ఇక అటు బెంగళూరు జట్టు అభిమానులందరికీ కూడా మరో ఊహించని షాకింగ్ న్యూస్ అందింది. ఏకంగా విరాట్ కోహ్లీ గాయం బారిన పడ్డాడట. సాధారణంగా విరాట్ కోహ్లీ ఫిట్నెస్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఫిట్నెస్ విషయంలో కచ్చితంగా ఉంటాడు కాబట్టి విరాట్ కోహ్లీ గాయాలు బారిన పడటం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఇక అంత ఫిట్నెస్ ఉంది. కాబట్టి ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు కూడా అతను అందుబాటులో ఉండగలుగుతున్నాడు.
కానీ ఇటీవల ipl లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం విరాట్ కోహ్లీ గాయం బారిన పడ్డాడట. కోహ్లీ మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు హెడ్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు. వరుసగా సెంచరీల బాధటం.. ఇక చురుగ్గా ఫీల్డింగ్లో పాల్గొనడంతో కోహ్లీ మోకాలి నొప్పుతో ఇబ్బంది పడి చివరి ఓవర్లో డగ్ అవుట్ కు వచ్చి కూర్చున్నాడని సంజయ్ బంగర్ తెలిపాడు. ఫిజియో చూశాక కాస్త ఉపశమనం పొందాడు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో కోహ్లీ గాయం పెద్దదైతే పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందుతున్నారు.