ధోని.. నీ మ్యాచ్ చూసేందుకు చావడానికైనా సిద్ధం?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు . ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగినప్పుడు మాత్రమే కాదు ఇక ఇప్పుడు ఐపీఎల్ ఆడుతున్నప్పుడు కూడా అదే రీతి లో అభిమానులను సంపాదించుకుంటున్నాడు కోహ్లీ. ఒకరకం గా చెప్పాలంటే ప్రస్తుతం భారత జట్టులో ఉన్న స్టార్ ప్లేయర్లతో పోల్చి చూస్తే అటు మహేంద్రసింగ్ ధోనీకే ఎక్కువ క్రేజ్ ఉంది అని చెప్పాలి. ధోని పేరు వినిపిస్తే చాలు పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోయే అభిమానులు కోట్లల్లో కనిపిస్తూ ఉంటారు.


 అయితే ప్రస్తుతం ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి.. కేవలం అటు ఐపిఎల్ లో మాత్రమే ఆడుతూ ఉన్నాడు. అయితే ఈ ఏడాది ధోనీకి చివరి ఐపీఎల్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కడ మ్యాచ్ ఆడిన కూడా ఇక ఆ మ్యాచ్ వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఇక హోమ్ గ్రౌండ్ ఉన్న జట్లతో పోల్చి చూస్తే చెన్నై అభిమానులు ఎక్కువగా మైదానాల్లో కనిపిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం.


 ఈ క్రమంలోనే అభిమానులందరూ ఆసక్తికర ఫ్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. మొన్నటికీ మొన్న నా ఆయుషు కూడా పోసుకొని మరో వందేళ్లు క్రికెట్ ఆడు ధోని అని ఒక అభిమాని ఫ్లకార్డు పట్టుకోగా ఇటీవల లక్నోతో జరిగిన మ్యాచ్ సమయంలో మైదానంలో ఒక అభిమాని పట్టుకున్న మరో ఫ్లకార్డు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రియమైన ధోని నీ మ్యాచ్ చూసేందుకు చావడానికి అయినా సిద్ధంగా ఉన్నాను అంటూ రాసి ఉన్న ఫ్లకార్డుని ఒక అభిమాని పట్టుకోగా.. ఈ ఫోటో వైరల్ గా మారిపోయింది. లక్నో, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: