స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంటుందట.. సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న కోహ్లీ?

praveen
భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధమైపోతున్నారూ. మార్చ్ 31వ తేదీ నుంచి 2023 ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఏ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై కూడా ఎంతో ఆసక్తి నెలకొంది. ఇక ఇదే విషయం పై ఎంతో మంది మాజీ ఆటగాళ్ళు కూడా స్పందిస్తూ ఇక తమ రివ్యూల ను సోషల్ మీడియా వేదికగా చెప్పేస్తున్నారు అని చెప్పాలి.

 ఇక గత ఎడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలం సమయం లో కొంత మంది ఆటగాళ్లను వదిలేసుకున్న జట్లు మరి కొంత మంది ఆటగాళ్లని జట్టు లోకి తీసుకున్నాయ్ అని చెప్పాలి. ఈ క్రమం లోనే కొన్ని జట్లు మరింత పటిష్టం గా మారి పోయాయ్. ఇక అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ఇలాగే పటిష్టంగా మారి పోయింది అని చెప్పాలి. ఈ క్రమం లోనే ఇక ఈసారి తప్పకుండా కప్పు గెలుస్తుందని ఎప్పటి లాగానే అభిమానులు అందరూ కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు.

 ఇక కోహ్లీ ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనేదానిపై కూడా చర్చ జరుగుతుంది. ఇక ఈ విషయం పై విరాట్ కోహ్లీ స్పందించాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత మునుపటి ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ ఈ ఏడాది ఐపీఎల్ లో అదరగొడతాను అంటూ చెప్పుకొచ్చాడు. పాత కోహ్లీని చూస్తారని... ఈ ఐపీఎల్లో అది తప్పకుండా జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఆట నుంచి బ్రేక్ తీసుకోవడం తనకు ఎంతగానో కలిసి వచ్చిందని.. చిన్నస్వామి స్టేడియంలో చాలా రోజుల తర్వాత ఆడుతుండడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అంటూ తెలిపాడూ. ఆర్సిబి ఆన్ బాక్స్ ఈవెంట్ లో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా చేస్తాను అంటూ అభిమానుల్లో ఆతృత పెంచేశాడు కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: