Ind vs Aus: స్వదేశంలో టీంఇండియా చెత్త రికార్డ్?

Purushottham Vinay
ఇక ఇండోర్ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య ఇండియా జట్టు కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. ఇప్పటి దాకా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఆడిన టెస్టు మ్యాచ్‌ల్లో టీమిండియాకు ఇది నాలుగో అతి తక్కువ స్కోరు.గత 20 సంవత్సరాలలో మూడు సార్లు టీమ్ ఇండియా 109 కంటే తక్కువ స్కోరుకే ఆలౌట్ అవ్వడం జరిగింది. ఆస్ట్రేలియా జట్టు ఇండియాలో తన 53వ టెస్టు మ్యాచ్‌ను ఆడుతోంది.ఆస్ట్రేలియాపై సొంత గడ్డలో ఇండియా జట్టు చేసిన అతి స్పల్ప స్కోరు 104 పరుగులు. 2004లో ముంబై వేదికగా జరిగిన టెస్టులో భారత్ జుట్టు కేవలం 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత 2017 వ సంవత్సరంలో పుణెలో జరిగిన టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే పరిమితం అవ్వగా ఇక రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 107 పరుగులకు ఆలౌట్ అయింది.ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 మూడో టెస్టులో మరో చెత్త రికార్డు టీమ్ ఇండియా పేరిట నమోదైంది. మూడో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా కేవలం 33.2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేయగలిగింది.



స్వదేశంలో టెస్టు మ్యాచ్‌ల చరిత్రలో మొదటి ఇన్నింగ్స్‌లో ఇండియా జట్టు అతి తక్కువ ఓవర్లు వేసిన నాలుగోదిగా నిలిచింది.ఇక ఇండోర్ టెస్ట్ కోసం నాగ్‌పూర్, ఢిల్లీ లాగా ఇండియా జట్టు స్పిన్ ట్రాక్‌ను తయారు చేయించింది. అయితే ఇక్కడ ఇండియా జట్టు తన సొంత ఉచ్చులో చిక్కుకుంది. మ్యాచ్ మొదటి రోజు రెండో సెషన్‌లో టీమిండియా ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా స్పిన్నర్లు టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను అసలు ఎక్కువసేపు నిలువనివ్వలేదు.ఇక ఇక్కడ మాథ్యూ కుహ్నెమన్ ఐదు వికెట్లు, నాథన్ లియాన్ మూడు ఇంకా అలాగే టాడ్ మర్ఫీ ఒక వికెట్ పడగొట్టారు.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా థర్డ్ టెస్ట్‌లో ఇండియా ఓపెనింగ్ జోడి మొదటి వికెట్‌కు 27 పరుగులు జోడించింది. అయితే ఫస్ట్ వికెట్ పడగానే,ఇక బ్యాక్‌టు బ్యాక్ వికెట్లు కోల్పోతూనే ఉంది.కేవలం 18 పరుగుల వ్యవధిలో ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లు ఔటయ్యారు. జట్టులో సగం మంది 45 పరుగుల వద్ద ఔట్ అయ్యి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్ కొంత సేపు పోరాడి ఆటాడినా చివర్లో భారత జట్టు కేవలం 109 పరుగులు మాత్రమే చేయగలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: