నేడే రెండో వన్డే మ్యాచ్.. సిరీస్ పై కన్నేసిన టీమ్ ఇండియా?
టీమిండియాలో ఆడుతున్న ప్రతి బ్యాట్స్మెన్ కూడా అద్భుతంగా రానించడంతో ఏకంగా 67 పరుగుల తేడాతో మొదటి వన్డే మ్యాచ్లో విజయం సాధించి 1-0 తేడాతో ఆదిత్యాన్ని సంపాదించింది భారత జట్టు. ఇకపోతే నేడు ఎంతో కీలకమైన రెండో వన్డే మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన శ్రీలంక జట్టు అటు గట్టి పోటీ ఇచ్చి.. ఇక రెండో వన్డే మ్యాచ్లో విజయం సాధించాలని భావిస్తుంది. తద్వారా సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని పట్టుదలతో ఉంది అని చెప్పాలి. అదే సమయంలో ఇక టి20 సిరీస్ గెలిచిన జోరుని వన్డే సిరీస్ లో కూడా కొనసాగించాలని భావిస్తుంది టీం ఇండియా.
ఈ క్రమంలోనే ఇప్పటికే మొదటి వన్డే మ్యాచ్లో గెలిచిన టీమ్ ఇండియా ఇక ఇప్పుడు నేడు జరగబోయే రెండో వన్డే మ్యాచ్లో కూడా గెలిచి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తుంది. కాగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ రెండో వన్డే మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అయితే మొదటి వన్డే మ్యాచ్ లో భాగంగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మఫామ్ లోకి రావడం.. ఇక టీమిండియా కు కలిసి వచ్చే అంశం అని చెప్పాలి. ఏం జరగబోతుందో చూడాలి మరి.