సిడ్ని థండర్స్ ఓటమి.. ఆనందంలో ఆర్సిబి ఫ్యాన్స్?
ఈ క్రమంలోనే ఎంతోమంది ఆ జట్టు అభిమానులు ఇక పేలవ ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు అని చెప్పాలి. జట్టులో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఇంత దారుణమైన ప్రదర్శన ఏంటి అంటూ సోషల్ మీడియా వేదిక ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో అటు ఐపిఎల్ ఫ్రాంచైజీ అయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు మాత్రం సంబరాల్లో మునిగిపోయారు. ఓడిపోయినందుకుగాను సిడ్నీ థండర్స్ జట్టుకి కృతజ్ఞతలు చెబుతూ ఉండటం గమనార్హం.
అదేంటి సిడ్నీ థండర్స్ జట్టు 15 పరుగులకు ఆల్ అవుట్ అయ్యి చివరికి చెత్త రికార్డు నమోదు చేస్తే ఆర్సిబి అభిమానులు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు. సిడ్నీ థండర్స్ ఓడిపోవడానికి ఆర్సిబి సంబరాలు చేసుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా అనే ఆలోచన మీ మదిలో మెదిలే ఉంటుంది. అయితే ఇక ఇలా బెంగుళూరు జట్టు అభిమానులు సంబరాలు చేసుకోవడానికి.. ఒక పెద్ద కారణమే ఉంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత తక్కువ స్కోరు నమోదు చేసిన జట్టుగా బెంగళూరుకి ఒక చెత్త రికార్డు ఉంది. 2017 సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో ఆర్సిబి జట్టు 49 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇటీవల సిడ్నీ 15 పరుగులకు ఆల్ అవుట్ కావడంతో ఆర్సిబి కంటే చెత్త ప్రదర్శన చేసింది. దీంతో ఇక ఆర్సిబిని విమర్శించే వాళ్ళు తక్కువ అవుతారని. ఎందుకంటే ఆర్సిబి కంటే చెత్త రికార్డును సిడ్ని థండర్స్ సాధించిందని ఎంతో మంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.