యాదృచ్ఛికం.. కోహ్లీ, సూర్య రికార్డ్స్ సేమ్ టు సేమ్?
అయితే ఇక గత కొంతకాలం నుంచి కఠిన పరిస్థితుల్లో భారీగా పరుగులు చేస్తూ టీమ్ ఇండియాకు విజయాలను అందిస్తున్నారు ఈ ఇద్దరు క్రికెటర్లు. మొన్నటికీ మొన్న ప్రపంచకప్ లో భాగంగా సూపర్ 12 మ్యాచ్లలో భారత జట్టు వరుసగా విజయం సాధించింది అంటే అది విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ ల బ్యాటింగ్ చలవే అని చెప్పాలి. ఎందుకంటే కష్ట సమయాల్లో తమ బ్యాటింగ్తో విజృంభించిన ఈ ఇద్దరు ప్లేయర్లు భారీగా పరుగులు చేశారు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో కోహ్లీ 296 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిస్తే.. ఇక సూర్యకుమార్ 239 పరుగులు చేశాడు.
అయితే వీరిద్దరి విషయంలో యాదృచ్ఛికంగా జరిగిన కొన్ని గణాంకాలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇంతకీ ఆ గణాంకాలు ఏంటంటే.. పొట్టి క్రికెట్లో భీకరమైన ఫామ్ లో కొనసాగుతున్న ఈ ఇద్దరు ప్లేయర్లు కూడా తమ టి20 కెరియర్లో 9వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును 39వ ఇన్నింగ్స్ లోనే అందుకున్నారు. ఇలా విరాట్ కోహ్లీ 39వ టీ20 ఇన్నింగ్స్ లోనే తన కెరియర్ లో 9వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోగా.. మొన్నటికి మొన్న సూర్య కుమార్ యాదవ్ సైతం తన 39వ టి20 ఇన్నింగ్స్ లోనే తొమ్మిదవ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.