రోహిత్.. పాకిస్తాన్ పై కనికరం చూపు?

praveen
భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే చాలు ఎక్కడలేని ఉత్సాహం ప్రతి ఒక్కరిలో వచ్చేస్తూ ఉంటుంది. అప్పటివరకు క్రికెట్ అంటే ఇష్టపడని వారు సైతం భారత్ పాకిస్తాన్ మ్యాచ్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఆ రేంజ్ లో  ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ జరిగింది అంటే ఉత్కంఠ ఉంటుంది అని చెప్పాలి. కేవలం ఇరుదేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు  ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా కన్నార్పకుండా మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు అంటే ఈ హై వోల్టేజీ మ్యాచ్ కి ఎంత క్రేజ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

 కాగా ఆసియా కప్లో భాగంగా నేడు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. యూఏఈ వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభం కాబోతుంది అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు నేరుగా స్టేడియం లో కూర్చుని మ్యాచ్ వీక్షించేందుకు యూఏఈ తరలివచ్చారు. అయితే నేడు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అంతకు ముందే ఒక ఆసక్తికర ఘటన జరిగింది. పాకిస్థాన్ జట్టుకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఆ దేశ అభిమానులు భారత కెప్టెన్ రోహిత్ శర్మను కలవడానికి వచ్చారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే రోహిత్ శర్మ వారి దగ్గరకు వెళ్లి ఎంతో ప్రేమగా కరచాలనం చేశాడు. అంతేకాకుండా ఒక అభిమానికి సెమీ హగ్ కూడా ఇచ్చాడు. తాము పాకిస్థాన్ జట్టుకు మద్దతు ఇస్తున్నప్పటికీ నిన్ను కలవడానికి ఇక్కడికి వచ్చాము అంటూ అభిమానులు చెప్పడం గమనార్హం. దీంతో రోహిత్ శర్మ చిరునవ్వుతో వారికి సమాధానం చెప్పాడు. అయితే మిమ్మల్ని కలవడం ఇక నా జీవితంలో మర్చిపోలేను అంటూ ఒక అభిమాని భావోద్వేగానికి లోనయ్యాడు. అంతేకాకుండా పాకిస్థాన్ జట్టులో  షాహీన్ అఫ్రిది లేడని.. అంత కొత్త బౌలర్ లేనని కాస్త కనికరం చూపాలి అంటూ అభిమాని రోహిత్ శర్మకు సరదాగా విజ్ఞప్తి చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: