వావ్.. ధోని మెంటార్ గా, డుప్లెసిస్ కెప్టెన్ గా ?
అంతేకాదండోయ్ ఐపీఎల్తో అనుబంధమున్న ఫ్రాంచైజీలు తమ కొత్త జట్లను ఏర్పాటు చేసుకున్నాయి అని చెప్పాలి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ సహా ఆరు జట్లు ఈ జాబితాలో ఉన్నాయి.ఈ క్రమంలోనే ఇక దక్షిణాఫ్రికాలో ప్రారంభం కాబోతున్న టి20 లీగ్ లో ఐపీఎల్లో బాగా రాణించిన కీలకమైన సార్లు కనిపించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అయినా జోహన్నెస్బర్గ్ సుపరిచితమైన ఆటగాళ్లను చూడవచ్చు అని తెలుస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్ కి ఎన్నో ఏళ్ల పాటు ఆడిన డుప్లెసిస్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ జట్టు జోహెన్నెస్బర్గ్ కెప్టెన్ గా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. చెన్నై ఆటగాడు మోయిన్ అలీని కూడా చేర్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత జట్టులోకి ఇంకెవరూ వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కాగా చెన్నై ఆటగాళ్లు జట్టు లో చేరిన సమయంలో ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జోహన్నెస్బర్గ్ జట్టుకు మెంటార్ గా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తుంది.. ఎంఎస్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతున్నారు.