భారత్ ఇంకా వెస్టిండీస్ టీ20 సిరీసు ఆఖరి దశకు చేరుకుంది. ఈ ఐదు టీ20ల సిరీసులో టీమ్ఇండియా 2-1తో ఆధిక్యంలో ఉంది.ఇక నేటి మ్యాచులోకనుక గెలిస్తే ఈ సిరీస్ అనేది మన వశం అవుతుంది. మ్యాచ్ టైమింగ్, లైవ్ టెలికాస్ట్, తుది జట్లు ఇంకా అలాగే స్టేడియం వివరాలు మీకోసం..భారత్ ఇంకా అలాగే వెస్టిండీస్ నాలుగో టీ20 వేదిక అమెరికాకు మారింది. ఫ్లోరిడాలోని లాడర్హిల్లో మ్యాచ్ అనేది జరుగుతుంది. మన భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు మ్యాచ్ అనేది మొదలవుతుంది. 7:00 గంటలకు టాస్ ని వేస్తారు.ఇక భారత్, వెస్టిండీస్ సిరీస్ను మనం దూరదర్శన్ స్పోర్ట్స్లో వీక్షించొచ్చు. ఎందుకంటే ప్రైవేటు ఛానళ్లు ఈ సిరీస్ను ప్రసారం చేయడం లేదు.ఇంకా అలాగే ఈ భారత్, వెస్టిండీస్ టీ20 లైవ్ స్ట్రీమింగ్లో కూడా వీక్షించొచ్చు. ఫ్యాన్కోడ్ యాప్లో లైవ్ స్ట్రీమింగ్ అనేది వస్తుంది. సబ్స్క్రిప్షన్ ఉన్నవాళ్లు నేరుగా లైవ్ స్ట్రీమింగ్ను కూడా ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని టెలికాం సంస్థలు సైతంఈ స్ట్రీమింగ్ను ఆఫర్ చేస్తున్నాయి.
ఇక టీం వివరాల విషయానికి వస్తే..
భారత్: రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్/ సంజు శాంసన్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్ ఇంకా రవి బిష్ణోయ్ / హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్ అలాగే అర్షదీప్ సింగ్ ఆడనున్నారు.
వెస్టిండీస్ టీం విషయానికి వస్తే.. కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్, రోమన్ పావెల్, షిమ్రన్ హెట్మైయిర్, రొమారియో షెఫర్డ్, అకేల్ హుస్సేన్, కీమోపాల్ / హెడేన్ వాల్ష్ జూనియర్ ఇంకా అలాగే అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెకాయ్ ఆడనున్నారు.ఇక ఈ సిరీస్ ని ఖచ్చితంగా టీం ఇండియా సొంతం చేసుకోవాలని చూస్తుందిమరి చూడాలి ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుందో..