కోహ్లీని రనౌట్ చేసినందుకు.. రహనేకు థాంక్స్?

praveen
2020- 21 ఎడిషన్ లో బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ ఆడేందుకు టీమ్ ఇండియా ఆస్ట్రేలియా లో పర్యటించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ సిరీస్ లో అద్భుతమైన ఆరంభం ఇచ్చిన టీమిండియా ఇక ఆ తర్వాత మాత్రం మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది.  కోహ్లీ సారథ్యంలో డే అండ్ నైట్ టెస్ట్ ఆడిన టీమ్ ఇండియా ఓటమి చవిచూసింది. రెండో ఇన్నింగ్స్ లో 36 పరుగులకే ఆలౌట్ కావడంతో క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డు నమోదు చేయడమే కాదు ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసింది.


 ఆ తర్వాత కోహ్లీ సెలవులపై స్వదేశానికి రావడంతో వైస్ కెప్టెన్ అజింక్యా రహానే టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్ లలో కూడా టీమిండియా గెలిచింది అన్న విషయం తెలిసిందే. ఇక 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత క్రికెట్లో ఈ విజయం చిరస్థాయిగా నిలిచిపోయింది అని చెప్పాలి. అయితే అప్పటీ ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ ఫైన్ అడిలైడ్ వేదికగా రహనే విరాట్ కోహ్లీని రనౌట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.


 విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 30 పరుగుల వద్ద ఉన్నాడు. లైటింగ్ మొత్తం పోయింది. ఫ్లడ్ లైట్స్ వెలుతురులో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. కోహ్లీ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఎక్కువ సేపు క్రీజులో ఉంటే మాకేం  నష్టం.  మ్యాచ్ గడిచేకొద్దీ కోహ్లీ క్రీజ్లో కుదురుకున్నాడు. ఇంకోవైపు రహానే కూడా బాగా ఆడుతున్నాడు. కానీ లక్కీగా రహానే కోహ్లీ ని రన్ ఔట్ చేశాడు. ఇదే గేమ్ చేంజ్ మూమెంట్ గా మారిపోయింది. అప్పుడే మ్యాచ్ నా చేతుల్లోకి వచ్చింది. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అందుకే ఆనాడు కోహ్లీని రనౌట్ అవుట్ చేసిన రహానే కు థాంక్స్ అంటూ చెప్పాడు టిమ్ ఫైన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: