అతనున్నాక.. టీమిండియా ఎలా ఓడిపోతుంది : పాక్ మాజీ క్రికెటర్

praveen
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టి20 సిరీస్లో భాగంగా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా సొంతగడ్డపై సత్తా చాటుతోంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మొదటి రెండు టి20 మ్యాచ్ లలో కూడా ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే. ప్రత్యర్థి సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం పాలు అయ్యింది. దీంతో అభిమానులు అందరూ కూడా ఎంతో నిరాశ చెందారు. అయితే వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోవడంతో సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే టీమిండియాకు తప్పక గెలవాల్సిన సవాల్ ఎదురైంది. ఇలాంటి సమయంలో మూడో టి20 మ్యాచ్ లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా ఎలా రాణించ పోతుందో అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే ఇక మూడవ టి20 మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా 48 పరుగుల తేడాతో సౌత్ఆఫ్రికాపై ఘన విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా 9.1 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలిన పోయింది. ఇక  ఈ విషయంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. సీనియర్ ఆటగాళ్లు లేకున్నప్పటికీ ద్వితీయ శ్రేణి జట్టు అద్భుతంగా పోరాడుతోంది అంటూ వ్యాఖ్యానించాడు.


 టీమిండియాలో సీనియర్లు లేకపోయినా అటు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వున్నాడని అందుకే టీమిండియా జట్టు సొంత గడ్డపై అంత తేలికగా ఓడిపోదు అని ఇంజమామ్ ఉల్ హక్ పేర్కొన్నాడు. అయితే 3వ టీ20 మ్యాచ్లో టీమ్ ఇండియా గెలవడంతో ఇక సిరీస్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి అన్నది తెలుస్తుంది . హర్షల్ పటేల్, చాహల్  అద్భుతమైన బౌలింగ్ తోనే మూడో టి-20లో విజయం సాధ్యమైందని అంటూ చెప్పుకొచ్చాడు. తొలుత సౌత్ ఆఫ్రికా సిరీస్ కైవసం చేసుకుంటుందని అనిపించినా భారత బౌలర్లు దానిని అడ్డుకున్నారంటూ తెలిపాడు ఇంజమామ్ ఉల్ హక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: