నా ఆల్ టైం ప్లేయింగ్ ఎలెవన్ జట్టు ఇదే : మహమ్మద్ కైఫ్
ఈ క్రమంలోనే ఐపీఎల్లో తమకు బెస్ట్ ఆల్ టైం ప్లేయింగ్ ఎలవెన్ జట్టు ఏంటి అన్నది కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తున్నారు. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ప్లేయింగ్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ ఐపీఎల్ లో తన ఆల్ టైం ప్లేయింగ్ ఎలెవెన్ జట్టును ప్రకటించారు. మహమ్మద్ ప్రకటించిన ఆల్టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్గా ఎంచుకోవడం గమనార్హం అంతేకాకుండా తన జట్టు లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు కూడా చోటు కల్పించాడు మహమ్మద్ కైఫ్.
కాగా టీం ఇండియా మాజీ ఆటగాడు మహమ్మద్ ఖాన్ ఎంచుకున్న తన ఆల్ టైం ప్లేయింగ్ ఎలెవన్ జట్టు వివరాలు ఇలా ఉన్నాయి. క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ,సురేష్ రైనా,ఏబీ డివిలియర్స్, ధోని, రస్సెల్, రషీద్ఖాన్, సునీల్ నరైన్,మలింగా బుమ్రా లకు చోటు కల్పించాడు అనే చెప్పాలి. అయితే మహమ్మద్ ఖాన్ ప్రకటించిన ఆల్ టైం ప్లేయింగ్ ఎలెవన్ జట్టు లో అటు పలువురు ప్రముఖ భారత క్రికెటర్లకు చోటు దక్కకపోవడం గమనార్హం. అయితే గతంలో హర్భజన్ సింగ్ ఎంచుకున్న ప్లేయింగ్ ఎలెవెన్ జట్టులో కూడా మహేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్సీ అప్పగించడం గమనార్హం.