హార్దిక్ పాండ్యా గుజరాత్ ను గెలిపిస్తాడా ?

VAMSI
ఈ రోజు ముంబై లోనే వాంఖడే మైదానంలో గుజరాత్ మరియు సన్ రైజర్స్ జట్ల మధ్యన మ్యాచ్ జరుగుతోంది. మొదటి అర్ధం భాగం ముగిసే సరికి సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసి గుజరాత్ ముందు కఠినమైన లక్ష్యాన్ని ఉంచింది. ఈ సీజన్ లో ఖచ్చితంగా ప్లే ఆఫ్ కు చేరుతాయి అని భావిస్తున్న జట్లలో ఇవి రెండూ ఉన్నాయి. అందుకే ఈ రోజు పోటీ తీవ్రంగా ఉంటుంది అని ముందుగానే మ్యాచ్ కామెంటేటర్ లు చెబుతూ ఉన్నారు. అనుకున్నట్లుగానే మొదటి ఇన్నింగ్స్ లో హైదరాబాద్ బ్యాట్స్మన్ లు గుజరాత్ బౌలర్ లను ఆడుకున్నారు అని చెప్పవచ్చు. వీరి ఇన్నింగ్స్ సాగిన ధోరణి చూస్తే 200 మార్క్ చేరుతుందని అందరూ ఊహించారు.
 
కానీ ఆఖరి ఓవర్ లో శశాంక్ సింగ్ చెలరేగడంతో ఈ స్కోర్ తో సరిపెట్టుకుంది. ముందుగా ఈ స్కోర్ కు అభిషేక్ శర్మ మరియు మార్ క్రామ్ లు అర్ద సెంచరీలు చేసి గట్టి పునాది వేశారు. మరోసారి కెప్టెన్ విలియమ్సన్ ఫెయిల్ అయ్యాడు. పూరన్ భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. అనూహ్యంగా శశాంక్ సింగ్ కేవలం 6 బంతుల్లో 3 సిక్సర్లు మరియు ఒక ఫోర్ తో 25 పరుగులు చేసి జట్టుకు విలువైన స్కోర్ ను అందించాడు. అయితే ఇప్పుడు గుజరాత్ కు ఈ స్కోర్ అంతా సులభం కాదు. ఇప్పటికీ ఈ మ్యాచ్ లో ఫేవరెట్ సన్ రైజర్స్ అని చెప్పాలి.

ఒకవేళ ఈ మ్యాచ్ లో గుజరాత్ గెలవాలంటే శుబ్ మాన్ గిల్ మరియు హార్దిక్ పాండ్యాలు రాణిస్తేనే వీలు అవుతుంది. ఎందుకంటే సన్ రైజర్స్ కు ఉన్న  బౌలింగ్ లైన్ అప్ ను తట్టుకుని ఈ స్కోర్ ను ఛేదించడం అంత సులభం కాదు. మరి గుజరాత్ ను హార్దిక్ పాండ్య గెలిపిస్తాడా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: