ధోని.. మాకోసం వెనక్కి రా ప్లీజ్?

praveen
భారత క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్ గా కొనసాగుతున్న మహేంద్రసింగ్ ధోని 2019 వరల్డ్ కప్ తర్వాత కొన్నాళ్లపాటు ఫామ్ కోల్పోయి తెగ ఇబ్బందులు పడ్డాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని రోజుల పాటు టీమిండియాకు దూరంగానే ఉన్నాడు. అయితే మళ్లీ ఊహించని రేంజిలో మహేంద్రసింగ్ ధోని జట్టులోకి వచ్చి అద్భుతంగా రాణిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ  చివరికి ఆగస్టు 15వ తేదీన ధోని రిటైర్మెంట్ ప్రకటించాడన్నా విషయం తెలిసిందే. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించడం పై దేశవాళీ క్రికెట్లో మాత్రం కొనసాగుతా అంటు చెప్పుకొచ్చాడు.

 దీంతో ధోని ఆట చూడాలనుకున్న అభిమానులందరికీ కూడా అటు ఐపీఎల్ ఒక్కటే మార్గంగా  మారిపోయింది అని చెప్పాలి. కాగా ఐపీఎల్  లో కూడా పేలవా ప్రదర్శనతో నిరాశపరిచాడు మహేంద్రసింగ్ ధోని.  ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రమే అద్భుతమైన ఫినిషింగ్ టచ్ చేస్తూ జట్టుకు విజయాన్ని అందిస్తూ ఉన్నాడు. ఇటీవలే ముంబై తో జరిగిన మ్యాచ్ లో చివర్లో ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ లు తనదైన ఫినిషింగ్ టచ్ ఇచ్చి గెలిపించాడు. మహేంద్రసింగ్ ధోని వయసు పెరిగినా బ్యాటింగ్లో పదును తగ్గలేదని తోని మరోసారి నిరూపించాడు. అంతేకాదు ఇక ఈ టోర్నీ తొలి మ్యాచ్లోనే అర్థ శతకం సాధించాడు.

 దీంతో ఇక ఇలా ధోని ఫినిషింగ్ చూసిన తర్వాత ధోనిలో ఇంకా కసి తగ్గలేదని మళ్లీ టీమిండియా జట్టులో చూడాలని అనుకుంటున్నాము అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ ధోని కి ఒక ఆశక్తికర విజ్ఞప్తి చేశాడు. రానున్న టి20 ప్రపంచకప్ కోసం ధోనీ తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవాలని ఇదేవిధంగా మనమంతా అతనికి విజ్ఞప్తి చేద్దామంటూ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. దీంతో ఇక ఈ ట్వీట్ చూసిన అభిమానులు అందరూ కూడా ధోని మాకోసం మళ్ళి వెనక్కి రా అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: