నాతో పాటు ఓపెనింగ్ చేసేది అతనే : రోహిత్

praveen
ఐపీఎల్ చరిత్రలోనే ఏ జట్టుకి సాధ్యం కాని రీతిలో ఏకంగా ఐదు సార్లు టైటిల్ సాధించిన జట్టు రోహిత్ గా కొనసాగుతోంది ముంబై ఇండియన్స్. ఎప్పుడు ఎంతో అద్భుతంగా రాణిస్తూ అదరగొడుతు ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఐపీఎల్ లో ఏ జట్టు కూడా ఐదుసార్లు టైటిల్ సాధించిన దాఖలాలు లేవు అని చెప్పాలి. అలాంటి ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పుడు సరికొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగేందుకు సిద్దమయ్యాడు. ఇక ఈ సారి కూడా టైటిల్ విజేతగా నిలిచి ఆరోసారి ఐపీఎల్లో టైటిల్ అందుకున్న జట్టుగా రికార్డు సృష్టించాలని నిర్ణయించుకుంది. అయితే గత సీజన్లో రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ తో కలిసి ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇటీవలే మెగా వేలానికి ముందు క్వింటన్ డికాక్ ను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోలేదు. ఇక మెగా వేలంలో మళ్లీ కొనుగోలు చేయలేదు. దీంతో రోహిత్ శర్మతో కలిసి ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ని ప్రారంభించబోయే క్రికెటర్ ఎవరు అన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే తనతోపాటు ఎవరు బ్యాటింగ్ కు వస్తారు అన్న విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్లో కూడా నేను ఓపెన్  వస్తాను ఇక ఈ సారి తనతో పాటు ఇషాన్ కిషన్ ఓపెనింగ్ ప్రారంభిస్తాడు అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. యువ ఆటగాడు ఇషాన్ కిషన్ తో కలిసి ఓపెనింగ్ చేయడానికి ఎదురుచూస్తున్నాను అంటూ తెలిపాడు.

 ఇటీవల జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో భాగంగా ఇక రోహిత్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇటీవలే ఐపీఎల్ మెగా వేలంలో ఇషాన్ కిషన్ ను ఏకంగా 15.25 కోట్లు పెట్టి పోటీపడి మరీ ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన బౌలింగ్ విభాగం గురించి మాట్లాడిన రోహిత్ శర్మ టైమల్ మిల్స్, జయదేవ్ లు మా జట్టులో ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు. వారు మా జట్టుకు కొత్త అయినప్పటికీ వారికి ఆట కొత్త కాదు. వారిద్దరూ కూడా అద్భుతమైన బౌలర్లు అంటు రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: