ఐపిఎల్ 2022: జాసన్ రాయ్ స్థానంలో ఆఫ్ఘన్ చిచ్చర పిడుగు రహ్మనుల్లా...

VAMSI
ఐపీఎల్ సీజన్ 15 స్టార్ట్ కావడానికి మరో 17 రోజులు మాత్రమే సమయం ఉంది. ఐపీఎల్ లో పాల్గొనే జట్లు అన్నీ టైటిల్ పోరు కోసం సమాయత్తం అవుతున్నాయి. ఈ సారి ఐపీఎల్ టైటిల్ కోసం మొత్తం 10 జట్లు పొతే పడుతున్న విషయం తెలిసిందే. కొత్తగా లక్నో సూపర్ జెయింట్స్ మరియు గుజరాత్ టైటాన్స్ పేరుతో రెండు జట్లు ఎంట్రీ ఇచ్చాయి. లక్నో జట్టుకు కెఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా, గుజరాత్ జట్టుకు మాత్రం ఇండియా అల్ రౌండర్ హార్దిక్ పాండ్య సారధిగా మొదటి సారి చేయనున్నాడు. అయితే గత వారమే గుజరాత్ టీమ్ కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్ బయో బబుల్ సమస్యతో ఐపీఎల్ ఆడకూడదని నిర్ణయించుకోవడంతో గుజరాత్ కు మ్యాచ్ లకు ముందే షాక్ తగిలినట్లయింది.

గుజరాత్ టైటాన్స్ ఇతనిని 2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే ఇతని ప్లేస్ లో ఎవరిని తీసుకోవాలన్న ప్రశ్నకు సమాధానం దొరికినట్లుంది. ఆఫ్గనిస్తాన్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ అయిన రహ్మనుల్లా గుర్బాజ్ ను తీసుకోవడానికి గుజరాత్ టైటాన్స్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ వేలంలోకి 50 లక్షల కనీస ధరతో ఇతను రిజిస్టర్ చేసుకోగా, వేలంలో పాల్గొన్న 10 జట్లలో ఎవ్వరూ కూడా ఇతనిని కొనడానికి ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు ఇతనిని కనీస ధరకు దక్కించుకోవడానికి గుజరాత్ టైటాన్స్ బీసీసీఐ కి పంపిందట. అయితే బీసీసీఐ నుండి కన్ఫర్మేషన్ వచ్చే వరకు గుజరాత్ టైటాన్స్ వెయిట్ చేయాల్సి ఉంది.

కాగా ఇప్పటికే గుజరాత్ జట్టులో ఆఫ్గనిస్తాన్ నుండి రషీద్ ఖాన్ మరియు నూర్ అహ్మద్ లు ఉన్నారు. ఈ అవకాశం రహ్మనుల్లాకు దక్కితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. ఇతను ఆఫ్ఘన్ జట్టులోకి వచ్చి కొంతకాలమే అయినా అప్పుడే జట్టులో ఒక కీలక ప్లేయర్ గా ఎదిగాడు. ఇతను క్రీజులో ఉన్నంత సేపు బౌలర్ కు చుక్కలే... వీరేంద్ర సెహ్వాగ్ లెక్క  మొదటి బంతి నుండి ఒకటే బాదుడు. ఇతను గుజరాత్ జట్టులోకి వస్తే పెద్ద ప్లస్ అవుతుంది. మరి చూద్దాం బీసీసీఐ ఏమంటుందో?  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: