బీసీసీఐ క్లారిటీ.. కొత్త షెడ్యూల్ ఇదే?

praveen
భారత జట్టు వరుసగా  సిరీస్ లు ఆడేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు భారత పర్యటనలో ఉండగా.. ఇక టీమిండియా వరుసగా వన్డే టి20 సిరీస్ లు ఆడుతుంది. ఇప్పటికీ వన్డే సిరీస్ ఆడిన టీమిండియా ఘనవిజయం సాధించింది. ఇక మరికొన్ని రోజుల్లో టి20 సిరీస్ ఆడబోతుంది. ఇక అదే సమయంలో ఈనెలాఖరులో అటు శ్రీలంక జట్టు భారత్లో పర్యటించనుంది అన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా టి20 టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది ఇండియా.



 అయితే తొలుత షెడ్యూల్ ప్రకారం టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉండగా ఇక శ్రీలంక క్రికెట్ బోర్డు అభ్యర్థనతో బీసీసీఐ షెడ్యూల్ లో పలు మార్పులు చేర్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తర్వాత జరగాల్సిన టి20 సిరీస్ ని ముందు నిర్వహించేందుకు సిద్ధమైంది బీసీసీఐ. ఈ క్రమంలోనే షెడ్యూల్ సంహరించడంతో ఇక ఇప్పుడు ముందు టి20 మ్యాచ్ లు జరగబోతున్నాయ్. అనంతరం ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ లో భాగంగా రెండు టెస్టు మ్యాచులు జరగబోతున్నాయి. ఇక ఇటీవల ఈ విషయాన్ని బిసిసీఐ అధికారిక సోషల్ మీడియాలో ఖాతాలో వెల్లడించింది.


 బీసీసీఐ తెలిపిన వివరాల ప్రకారం.. సవరించిన షెడ్యూల్ ఇలా ఉంది. ఫిబ్రవరి 24న తొలి టీ20, ఫిబ్రవరి 26న రెండో టీ20, 27న మూడో టీ20 మ్యాచ్ లు జరగబోతున్నాయి . తొలి టీ20 లక్నో వేదికగా, మిగతా రెండు మ్యాచ్‌లు ధర్మశాల వేదికలను ఫిక్స్ చేశారు. ఇక ఆ తర్వాత  తొలి టెస్ట్ మొహాలీ వేదికగా మార్చి 4 నుంచి 8 వరకు జరుగుతుంది. రెండో టెస్ట్ బెంగళూరు వేదికగా మార్చి 12 నుంచి 16 వరకు జరుగుతుందని  ఇటీవలే సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేసింది బీసీసీఐ. కాగా బుధవారం నుంచి వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్ ముగియగానే శ్రీలంకతో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: