అందుకే ఓడిపోయాం.. కోహ్లీ షాకింగ్ కామెంట్స్?

praveen
భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా కు చివరికి నిరాశే ఎదురైంది. ఈసారి తప్పకుండా సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్ విజయం సాధించాలి అనుకున్న ఓటమి తప్పలేదు. మొదటి టెస్టు మ్యాచ్లో గెలిచి ఇక టెస్టు సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న టీమిండియాకు వరుసగా రెండో టెస్ట్ మ్యాచ్ లలో ఎదురు దెబ్బ తగిలింది. చివరికి సిరీస్ చేజారిపోయింది. ఇక ఈసారైన అటు భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని అనుకున్నారు అందరు. ఊహించని రీతిలో టీమ్ ఇండియా ఓటమి పాలు అయింది అన్న విషయం తెలిసిందే.

 3 టెస్టుల సీరీస్ లో 2-1 తేడాతో ఆతిథ్య సౌతాఫ్రికా జట్టు సిరీస్ కైవసం చేసుకుంది. దీంతో మరోసారి భారత అభిమానులందరికీ నిరాశే ఎదురైంది. అయితే మొదటి మ్యాచ్ లో గెలిచిన తర్వాత ఇక టెస్టు సిరీస్ గెలవడం ఖాయం అని భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఊహించని రీతిలో అటు టీమిండియాకు వరుసగా రెండు మ్యాచ్ లలో ఓటమి తప్పలేదు. అయితే ఇక సిరీస్ కోల్పోవడం పై టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం స్పందించాడు. ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విరాట్ కోహ్లీ.

 పేలవా బ్యాటింగ్ తో నే ఓటమిపాలయ్యాము. మరో కారణం చెప్పి తప్పించుకోవాలనీ ప్రయత్నించడం లేదు అంటూ విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. ప్రత్యర్థి బౌలర్లను మాపై ఒత్తిడిని పెంచడం లో విజయవంతమయ్యారు. ఫలితం సహజంగానే ఎంతగానో నిరాశ కలిగింది. దక్షిణాఫ్రికాను వారి సొంతగడ్డపైనే ఓడించగము అని బలంగా నమ్మాము కానీ అది సాధ్యం కాలేదన్నది ప్రస్తుతం వాస్తవంగా మారిపోయింది. కీలక సమయాల్లో టీమిండియా ఆటగాళ్లు ఏకాగ్రత కోల్పోయారు అదే సమయంలో దక్షిణాఫ్రికా బౌలర్లు ఎంతో అద్భుతంగా రాణించారు. విదేశాల్లో జోరు మీద ఉన్నప్పుడు దానిని కొనసాగించడం ఎంతో ముఖ్యం. కానీ మేము మొదటి మ్యాచ్ లో గెలిచిన తర్వాత అదే జోరును కొనసాగించడంలో విఫలం అయ్యాము అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: