విరాట్ కోహ్లీ.. టీమిండియాకు ఒంటి చేత్తో ఎన్నో విజయాలు అందించాడు. అయితే.. మెగా టోర్నీ ఐపీఎల్ లో మాత్రం.. విరాట్ కోహ్లీ అంతగా రాణించడం లేదు. ఈ నేపథ్యంలోనే... ఆర్సీబీ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు విరాట్ కోహ్లీ. గత 9 సీజన్లలో ఆర్సీబీని నడిపించిన విరాట్ ఆ పొజిషన్ నుంచి తప్పుకోవడంతో తర్వాతి కెప్టెన్ ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది...ఐపీఎల్ 2022 రిటెన్షన్లో భాగంగా విరాట్ కోహ్లీతో పాటు గ్లెన్ మ్యాక్స్వెల్, మహ్మద్ సిరాజ్లను అట్టిపెట్టుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. యజ్వేంద్ర చాహాల్ను కూడా వేలానికి వదిలేసింది... గ్లెన్ మ్యాక్స్వెల్కి వచ్చే సీజన్లో ఆర్సీబీ జట్టు కెప్టెన్సీ దక్కవచ్చని ప్రచారం జరిగింది. అయితే నిలకడలేమికి కేరాఫ్ అడ్రెస్గా ఉండే మ్యాక్స్వెల్కి కెప్టెన్సీ అప్పగించే సాహసం రాయల్ ఛాలెంజర్స్ చేయకపోచ్చు... పంజాబ్ కింగ్స్కి గత రెండు సీజన్లలో కెప్టెన్గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, ఆ టీమ్ను వీడడంతో... ఆర్సీబీ తర్వాతి కెప్టెన్ అతనేనంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి...అయితే ఐపీఎల్ 2022 సీజన్లో కొత్తగా రాబోతున్న లక్నో ఫ్రాంఛైజీతో కెఎల్ రాహుల్, రూ.20 కోట్లకు భారీ ఢీల్ కుదుర్చుకున్నాడని టాక్ వినబడుతోంది...ఇదే నిజమైతే కెఎల్ రాహుల్, ఐపీఎల్ మెగా వేలానికి కూడా రాకపోవచ్చు. ఇక మిగిలింది శ్రేయాస్ అయ్యర్, డేవిడ్ వార్నర్.
ఐపీఎల్ 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఫైనల్కి చేర్చాడు శ్రేయాస్ అయ్యర్.యువ జట్టును ఫైనల్కి చేర్చి, కెప్టెన్గా సూపర్ సక్సెస్ అయ్యాడు శ్రేయాస్ అయ్యర్. ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి బయటికి వచ్చిన అయ్యర్ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడే అవకాశం ఉంది. అటు డేవిడ్ వార్నర్ కోసం కూడా ఫ్రాంఛైజీలు ఎగబడే ఛాన్స్ ఉంది. ఇలాంటి తరుణంలో మనీశ్ పాండేకి ఆర్సీబీ కెప్టెన్సీ అప్పగించాలని యోచిస్తోందట టీమ్ మేనేజ్మెంట్. మనీశ్ పాండే, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాడు కూడా కావడం అతన్ని ఆర్సీబీ కెప్టెన్ చేయాలనే డిమాండ్ అభిమానుల నుంచి వస్తోందట...సన్రైజర్స్ హైదరాబాద్ 2021 సీజన్లో ఆడిన ఆఖరి మ్యాచ్లో మనీశ్ పాండే కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్లో ఓడినా, భారీ స్కోరింగ్ మ్యాచ్లో కలిసికట్టుగా పోరాడేలా జట్టును నడిపించిన కెప్టెన్గా మనీశ్ పాండేకి మంచి మార్కులే పడ్డాయి.