ఆ ఫార్మాట్కు టీమిండియా అంబాసిడర్ : రవిశాస్త్రి

praveen
గత కొన్ని రోజుల నుంచి టీమిండియా టెస్టు ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. స్వదేశంలోనే కాదు విదేశీ పర్యటనలో సైతం అద్భుతంగా రాణిస్తూ వరుసగా సిరీస్ లను కైవసం చేసుకొని దూసుకు పోతోంది. ఇక టెస్టు ఫార్మాట్లో అవకాశం వచ్చిన ప్రతి ఒక ఆటగాడు కూడా అద్భుతంగా రాణిస్తూ ఉండటం గమనార్హం. ఇక విరాట్ కోహ్లీ తనదైన వ్యూహాలతో భారత టెస్టు జట్టులో ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఇప్పటికే ఇక టెస్ట్ క్రికెట్ లో భారత జట్టు విరాట్ కోహ్లీ సారథ్యంలో ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధించింది.

 ఇక ఇటీవలే సొంతగడ్డపై కూడా టీమిండియా ఇదే విజయ పరంపర కొనసాగింది. న్యూజీలాండ్ జట్టుపై భారీ తేడాతో విజయం సాధించింది టీమిండియా జట్టు. ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న టీమిండియా కాస్త చివరికి మూడవ స్థానానికి పడిపోయింది  కానీ ఇటీవలే ఇక ఏకంగా 372 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించి ఒకవైపు సిరీస్ కైవసం చేసుకోవడమే కాదు మరోవైపు వరల్డ్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది టీమిండియా.

 అయితే టెస్టు ఫార్మాట్లో టీమిండియా వరుస విజయాలు సాధించడం పై ఇటీవల టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ ఫార్మాట్ క్రికెట్కు టీమిండియా అంబాసిడర్ అంటూ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. గత కొన్నేళ్లుగా టీమిండియా ఎంతో మెరుగ్గా రాణిస్తుందని అంటూ తెలిపాడు. కెప్టెన్గా కోహ్లీ సహా చాలా మంది ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ ను అమితంగా ఇష్టపడతారని చెప్పుకొచ్చాడు రవి శాస్త్రీ. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి ఉండొచ్చు కానీ టెస్ట్ క్రికెట్ లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తూ ఉందంటే అందుకు భారత ఆటగాళ్లకు టెస్ట్ క్రికెట్ పై ఉన్న ఆసక్తి కారణం అంటూ రవిశాస్త్రి తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: