రోహిత్ శర్మ కాళ్లు మొక్కిన అభిమాని.. ఫోటో వైరల్?
మైదానంలోకి పరుగులు పెడుతూ రావడంతో ఇక తమ అభిమాన క్రికెటర్లతో ఫోటోలు దిగడం లేదా మాట్లాడటం లాంటివి చేస్తూ ఉంటారు ఎంతోమంది అభిమానులు. ఇప్పటివరకు పలు మ్యాచ్ లలో ఇలా సెక్యూరిటీ సిబ్బందినీ దాటుకుని మరీ మైదానంలోకి పరుగులు పెట్టిన అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇక ఇటీవల ఇలాంటిదే జరిగింది. ప్రస్తుతం టీమిండియా జట్టు స్వదేశీ గడ్డపై న్యూజిలాండ్ జట్టుతో టి20 సిరీస్ ఆడుతుంది అనే విషయం తెలిసిందే. ఇక ఈ టి 20 సిరీస్ కు పూర్తిస్థాయి కెప్టెన్గా రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించాడు.
అయితే ఇక వరుసగా రెండు మ్యాచ్లలో గెలిచిన టీమ్ ఇండియా జట్టు ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. అయితే భారత్ న్యూజిలాండ్ మధ్య రెండో టి 20 మ్యాచ్ జరుగుతున్న సమయంలో అనుకోని ఘటన జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి ఒక అభిమాని మైదానంలోకి దూసుకు వచ్చాడు. ఈ క్రమంలోనే తన అభిమాన క్రికెటర్ అయిన రోహిత్ శర్మ పాదాలు తాకేందుకు ప్రయత్నించాడు ఆ అభిమాని. ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ మీద పడుకొని నమస్కరించాడు. అటు వెంటనే స్టాండ్ వైపు పరుగులు తీశాడు. ఇక దీనిపై ప్రస్తుతం నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలా అయితే ఆటగాళ్ల భద్రత ఎక్కడ ఉంది అంటూ కొంతమంది ప్రశ్నిస్తుంటే.. మరికొంతమంది అభిమాని కల నెరవేరింది అంటూ కామెంట్ లు పెడుతూ ఉండడం గమనార్హం.