T20 WORLD CUP: ప్రపంచకప్ చరిత్రలో 4, 4, 4, 4, 4, 0
ఇదిలా ఉంటే ఇప్పుడిప్పుడే టోర్నీ లో సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. నిన్న ఆప్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ముదు బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఓపెనర్లు కేఎల్. రాహుల్ - రోహిత్ శర్మ రెచ్చి పోవడతో ఏకంగా 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ టోర్నమెంటులో తొలి సారి 200 పరుగుల స్కోరు చేసిన జట్టుగా భారత్ రికార్డులకు ఎక్కింది.
ఇదిలా ఉంటే నిన్నే మరో రికార్డు నమోదు అయ్యింది. భారత్ - ఆప్ఘాన్ మ్యాచ్ కు ముందు స్కాట్లాండ్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మిల్నే వేసిన ఆరో ఓవర్లో స్కాట్లాండ్ బ్యాటర్ మాథ్యూ క్రాస్ రెచ్చిపోయి మరీ బంతిని బాదాడు. తొలి ఐదు బంతులను వరుసగా బౌండరీకి తరలించి మిల్నే ను బెంబేలు ఎత్తించాడు.
దీంతో ఆ ఒక్క ఓవర్లోనే స్కాట్లాండ్ కు ఏకంగా 20 పరుగులు లభించాయి. అయితే ఈ పొట్టి ప్రపంచ కప్ లో గతంలో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ జాక్వస్ కలిస్ స్కాట్లాండ్ బౌలర్ జాన్ స్టాండర్ ను కూడా ఒకే ఓవర్లో వరుసగా ఐదు బౌండరీలు బాదాడు. ఇది రెండోసారి.