సిఎస్కె కెప్టెన్సీపై జడేజా పోస్ట్.. అంతలో డిలీట్.. అసలు ఏముందంటే?

praveen
భారత క్రికెట్ చరిత్రలో దిగ్గజ క్రికెటర్ గా కొనసాగిన మహేంద్రసింగ్ ధోని ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించి  షాక్ ఇచ్చాడు. అయితే ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి అటు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కు మాత్రం కెప్టెన్గా కొనసాగుతూ ఉండటం గమనార్హం. ధోనీ తన కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇక ఐపీఎల్ నుంచి కూడా తప్పుకుంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ సీఎస్కే కెప్టెన్ గా కొనసాగుతున్నాడు ధోని . కానీ ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

 అంతేకాదు మునుపటిలా చెన్నై సూపర్ కింగ్స్ కూడా బాగా రాణించలేక పోతోంది. దీంతో ధోనిని చెన్నై కెప్టెన్ గా తొలగించ పోతున్నారని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది. తమకు ఎప్పటికీ ధోనీనే కెప్టెన్ అంటూ చెన్నై జట్టు యాజమాన్యం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇకపోతే అటు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కూడా ఎక్కువ రోజులు కొనసాగలేదు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకవేళ ధోనీ తప్పుకుంటే తర్వాత సీఎస్కే జట్టుకు కెప్టెన్ ఎవరు అనే దానిపై కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది.

 ఈ క్రమంలోనే ఇటీవల సీఎస్కే ఫాన్స్ ఆర్మీ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టింది. ధోని తర్వాత కెప్టెన్ ఎవరైతే బాగుంటుంది అంటూ ఒక ప్రశ్న అడిగింది. ఇక ఈ పోస్ట్ పై అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న రవీంద్ర జడేజా స్పందించాడు.  జెర్సీ నెంబర్ 8 అయితే బాగుంటుంది అంటూ పోస్ట్ పెట్టాడు. అయితే కాసేపటికి ఆ పోస్టుని డిలీట్ చేశాడు రవీంద్ర జడేజా. కానీ అప్పటికే ఎంతో మంది స్క్రీన్ షాట్స్ తీసుకున్నారు.  అయితే జెర్సీ నెంబర్ 8 రవీంద్ర జడేజా జెర్సీ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: