టి20 వరల్డ్ కప్.. పాకిస్తాన్ తో మ్యాచ్ కి టీమిండియా జట్టు ఇదేనట?
ఇక ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించారు. గౌతం గంభీర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు అనే విషయం తెలిసిందే. టీమిండియా కు సంబంధించిన అన్ని విషయాలపై కూడా స్పందిస్తూ తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవలె టి20 వరల్డ్ కప్ గురించి చెప్పుకొచ్చారు గౌతం గంభీర్. అయితే టి20 వరల్డ్ కప్ లో మిగతా మ్యాచ్ ల గురించి ప్రస్తావించకుండా కేవలం పాకిస్తాన్ తో టీమిండియా తలబడబోయే మ్యాచ్ గురించి మాత్రమే ప్రస్తావించారు.
ఈ క్రమంలోనే టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో ఆడే తన డ్రీం లెవెన్ భారత జట్టును గౌతం గంభీర్ ప్రకటించారు. ఇక గౌతం గంభీర్ ప్రకటించిన జట్టులో కె.ఎల్.రాహుల్ రోహిత్ శర్మను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. ఇక ఆ తర్వాత మిగతా స్థానాలకు కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ, జస్ప్రిత్ బూమ్రా పేర్లను ప్రకటించారు గౌతం గంభీర్. ఇకపోతే అక్టోబర్ 24వ తేదీన పాకిస్తాన్ భారత్ మధ్య మొదటి మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ గురించి అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.