రో"హిట్" శ్రమకు ఫలితం దక్కేనా ?
అప్పటికి కేవలం రెండు రోజుల ఆట మాత్రమే పూర్తయింది. మూడవ రోజు రెండవ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్, ఒకరకంగా చెప్పాలంటే డేంజర్ జోన్ లో ఉంది. 99 పరుగుల మొదటి ఇన్నింగ్స్ లోటు తో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు రాహుల్ లు ఆచితూచి ఆడారు. సెకండ్ ఇన్నింగ్స్ లో పటిష్టమయిన స్కోర్ చేసి 466 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. ఇంత స్కోర్ ను చేయగలిగింది అంటే రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్ కారణం. రోహిత్ శర్మ 127 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్ కు రాహుల్ (46), పుజారా (61) మరియు కోహ్లీ (44) ల నుండి చక్కని సహకారం లభించింది.
వీరందరి సహకారంతో రోహిత్ శర్మ రికార్డు సెంచరీని అందుకున్నాడు. మ్యాచ్ ఓడిపోతుందేమో అనుకున్న తరుణం నుండి ఈ రోజు ఖచ్చితంగా గెలుస్తాము అన్న నమ్మకం రావడానికి కారణం రోహిత్ ఇన్నింగ్స్ తేడా. ఇక ఇన్నింగ్స్ చివర్లో పంత్ మరియు శార్దూల్ లు అర్ధసెంచరీలు చేయటంతో 367 పరుగులు భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచగలిగింది. ఈ రోజు ఆఖరి రోజులో ఇండియా బౌలర్లు చెలరేగి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ కు అర్ధం తెస్తారా అన్నది చూడాలి. బ్యాటింగ్ లో చెలరేగుతున్న శార్దూల్ బౌలింగ్ లోనూ తన ఎంపికకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. సెకండ్ టెస్ట్ హీరో మహమ్మద్ సిరాజ్ ఈ టెస్ట్ లోనూ మ్యాచ్ ను మలుపుతిప్పే స్పెల్ తో చెలరేగుతాడా చూడాలి.