రోహిత్ ను బంతితో కొట్టిన పృథ్వీ షా.. చేతికి గాయం.. హిట్ మాన్ సీరియస్..?

praveen
ఈ మధ్య కాలంలో పృథ్వీ షా సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిపోయాడు అనే విషయం తెలిసిందే. మొన్నటి వరకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా వరుసగా పేలవ ప్రదర్శన చేయడంతో పృథ్వీ షా పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు భారత క్రికెట్ ప్రేక్షకులు. ఫీల్డింగ్  లో కూడా  పూర్తిగా విఫలం కావడంతో... తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక పృథ్వీ షా విషయం గురించి ఇటీవలే సోషల్ మీడియాలో వార్తలు కాస్త తగ్గుతున్న  నేపథ్యంలో మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయాడు పృథ్వీ షా. బ్రిస్బేన్ వేదిక భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఇటీవల ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

 ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. స్పిన్నర్  వాషింగ్టన్ సుందర్ వేసిన బౌలింగ్లో స్క్వేర్ దిశగా ఫుల్ చేశాడు మార్కస్ లబుషేన్. ఈ క్రమంలోనే సింగిల్ కోసం పరుగు పెట్టాడు. అప్పుడే సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా  మైదానంలోకి వచ్చిన పృథ్వీ షా.. బంతి అందుకుని రనౌట్ కోసం వేగంగా బంతిని త్రో  చేశాడు. కానీ పృథ్వీ షా త్రో  చేసిన తర్వాత అది  కాస్త గురితప్పి రోహిత్ శర్మ చేతిని తాకింది. ఇక ఈ సన్నివేశం తో పాటు మ్యాచ్ కామెంట్ థియేటర్లు పకపకా నవ్వారు..  రోహిత్ శర్మ చాలా సీరియస్ గా కనిపించాడు.

 అయితే బాల్ గట్టిగా తగలడంతో అటు రోహిత్ శర్మ చేతికి గాయం కూడా అయినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. పృథ్వీ షా పై కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. ఫీల్డింగ్  చేసే ముందు కనీసం ఆ మాత్రం చూసుకోవా అంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే.. వాస్తవానికి అక్కడ పృథ్వీ షా తప్పు  లేదని.. అతడు రనౌట్ చేయాలనే ఆలోచనతోనే.. త్రో విసిరాడని.. ఆ సమయంలో రోహిత్ శర్మ అడ్డుగా నిలబడి పోవడంతో బంతి నేరుగా వెళ్లి అతని చేతిని తాకింది అంటూ మరికొంతమంది మద్దతుగా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: