సిరాజ్ కి అరుదైన గౌరవం.. రహానే పై ప్రశంసలు వర్షం.?

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు ఆస్ట్రేలియాతో వరుసగా సిరీస్ లలో  తలపడుతుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి టెస్టులో భారత్ ఓటమి పాలైంది.  మొదట భారత్ ఆధిపత్యం సాధించినట్లు అనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం పేలవ ప్రదర్శనతో ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల అడిలైడ్ వేదికగా రెండవ టెస్ట్ మ్యాచ్ జరిగింది. అయితే బాక్సింగ్ డే టెస్టు ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి మహమ్మద్ సిరాజ్ అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే ఇటీవల మొహమ్మద్ సిరాజ్ కు టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే వినూత్న రీతిలో గౌరవించాడు.


 టీమిండియా ఇన్నింగ్స్ ముగించుకుని డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లే సమయంలో మహమ్మద్ సిరాజ్ ను జట్టు ను లీడ్  చేసేందుకు అవకాశమిచ్చాడు అజింక్య రహానే. బాక్సింగ్ డే టెస్ట్  మ్యాచ్ జరిగిన సందర్భంగా టి విరామం  సమయంలో ఈ సంఘటన జరిగింది.  టీ విరామం ఇవ్వడం తో వెంటనే కెప్టెన్ అజింక్య రహానే మహమ్మద్ సిరాజ్ వద్దకు వెళ్లి నువ్వు ముందు వెళ్లి జట్టును లీడ్ చేయ్  వెనకాల మేము అందరం వస్తాం అంటూ చెప్పాడు..  జట్టు సభ్యులందరూ మహమ్మద్ సిరాజ్ వెనక వచ్చేశారు. అయితే టెస్ట్ క్రికెట్ లో అడుగుపెట్టిన మహమ్మద్ సిరాజ్ కు ఇదే తమ జట్టు నుంచి ఇచ్చే గౌరవం అంటూ అజింక్యా రహానే చెప్పుకొచ్చాడు.



 అజింక్య రహానే చర్యపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒక వ్యక్తికి ఉండే అన్ని రకాల లక్షణాలు అజింక్యా రహానే లో ఉన్నాయని.. ఆటగాళ్లను ప్రోత్సహించడం వారిలో మరింత నమ్మకాన్ని పెంచడంలో అజింక్య రహానే తీరు ఎంతో బాగుందని ప్రస్తుతం ఎంతో మంది నెటిజన్లు అజింక్య రహానేపై  ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక మొహమ్మద్ సిరాజ్ టెస్ట్ ఇన్నింగ్స్ లో ఎంత అద్భుతంగా బౌలింగ్ వేసాడో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా జట్టులో అడుగుపెట్టిన మొట్టమొదటి మ్యాచ్ లోనే  అద్భుతంగా రాణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: