భారత జట్టు ముందు భారీ టార్గెట్.. చావో రేవో తేల్చుకోనున్న టీమిండియా..?

praveen
ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం ఆస్ట్రేలియాతో మొదటి వన్డే సిరీస్ ప్రారంభించి మొదటి మ్యాచ్ ఆడింది  భారత జట్టు. ఇక మొదటి మ్యాచ్లో భారత జట్టు అంతగా రాణించలేక పోవడంతో చివరికి ఓటమి చవి చూసింది అని చెప్పాలి. బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలం కావడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లకు భారీ  పరుగులు ఇచ్చింది భారత్.  ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత జట్టు టాప్ ఆర్డర్ తక్కువ పరుగులకే ఐదు వికెట్లు కోల్పోవడంతో భారత్ కష్టాల్లో పడింది.



 ఇక హార్థిక్ పాండ్యా క్రీజులోకి వచ్చి కాస్త మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ ఒక గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అయినప్పటికీ 66 పరుగుల తేడాతో పరాజయం పాలయింది భారత్.  అయితే భారత్లో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది.  ప్రతి ఆటగాడు కూడా చెలరేగి ఆడటంతో ప్రస్తుతం మరోసారి భారీ స్కోరు చేయగలిగింది ఆస్ట్రేలియా జట్టు. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫించ్ లు  అద్భుతంగా రాణించడంతో... ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ కూడా అద్భుతంగా రాణించడంతో మరోసారి ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు చేసింది.



 ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 83 ఫించ్ 60 శుభారంభాన్ని ఇవ్వగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్  64 బంతుల్లో 104 పరుగులు చేసి అదరగొట్టి ఆశ్చర్యపరిచాడు. ఇక ఆ తర్వాత లబుషేన్ 70 పరుగులు చేయగా మాక్స్వెల్ మరోసారి అదరగొట్టి 29 బంతుల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి 63 పరుగులు చేశాడు. దీంతో 50 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 389 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత జట్టు ముందు ఉంచింది. ప్రస్తుతం ఈ లక్ష్య ఛేదనలో భారత జట్టు ఎలా చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. కాగా ప్రస్తుతం ఈ మ్యాచ్ భారత జట్టుకు డు ఆర్ డై మ్యాచ్ గా మారింది అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: