సిఎస్కే నిర్ణయం.. ముంబైకి వరం అయింది.. కొత్త చరిత్రకు కారణమైంది..?

praveen
ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు భారత క్రికెట్ ప్రేక్షకులందరిలో  ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రతి ఐపీఎల్ సీజన్ లో కూడా టైటిల్ ఫేవరెట్ జట్టుగా రంగంలోకి దిగుతున్నాయి చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్లు. ఇప్పటివరకు అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన జట్లుగా కూడా ఈ రెండు జట్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడు సార్లు టైటిల్ గెలవగా..  ముంబై ఇండియన్స్ జట్టు ఈ  ఏడాది తో కలిపి ఐదు సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా  సరికొత్త చరిత్రకు నాంది పలికింది. అయితే ఇప్పటి వరకు మూడు సార్లు టైటిల్ గెలవడమే కాదు ఈ  ఏడాది సీజన్ మినహా  ఆడిన ప్రతీ సారి కూడా ప్లే ఆప్ కి అర్హత సాధించిన జట్టుగా  రికార్డు సృష్టించింది.



 ఇక ఈ ఏడాది మాత్రం పేలవ ప్రదర్శన చేసి విమర్శలు ఎదుర్కొంటూ ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన మొదటగా జట్టుగా  రికార్డును సొంతం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అయితే ఐపీఎల్ చరిత్రలోని అత్యుత్తమ జంటగా గుర్తింపు పొందిన ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య వైరం ఉన్న సంగతి తెలిసిందే. కారణం.. 2011లో ఐపీఎల్ వేలానికి ముందు రోహిత్ శర్మను  జట్టులోకి తీసుకోవాలని అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్ అడగటంతో.. అతడి కోసం బిడ్డింగ్  చేయబోవు అంటూ స్పష్టం చేసింది జట్టు యాజమాన్యం. ఇక ఆ తర్వాత 2008లో దక్కన్ ఛార్జర్స్ తరపున ఐపీఎల్లో అడుగుపెట్టిన  రోహిత్ శర్మ మూడేళ్లపాటు హైదరాబాద్ తరఫున ఆడాడు.



 ఇక 2013 నుంచి ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడంతో అప్పటినుంచి రోహిత్ శర్మ సారథ్యంలోనే ముంబై ఇండియన్స్ టైటిల్స్  గెలిచింది. దీంతో ఒకవేళ అప్పుడు రోహిత్ శర్మ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసి ఉంటే రోహిత్ శర్మకు కెప్టెన్ అయ్యే అవకాశం వచ్చేది కాదని. అందుకే అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో ముంబై ఇండియన్స్ జట్టు కు ఎంతగానో కలిసి వచ్చిందని ఒక అద్భుతమైన కెప్టెన్ దొరకడం తో పాటు... ఐపీఎల్ లో  కొత్త చరిత్ర సృష్టించడానికి కారణం అయ్యింది అని అటు ప్రేక్షకులు కూడా భావిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: