ధోని వీడ్కోలు.. ఇక నేను కూడా రిటైర్మెంట్ తీసుకుంటా...?

praveen
టీమిండియా దిగ్గజ ఆటగాడు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడం నుండి ధోని అభిమానులు ఇంకా తేరుకోలేక పోతున్నారు. అయితే కేవలం భారత క్రికెట్ అభిమానులే  కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధోనీ అభిమానులందరూ ధోని రిటైర్మెంట్ పై తీవ్ర నిరాశ  వ్యక్తం చేస్తున్నారు. ధోనికి  ఎంతో మంది వీరాభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అలాంటి వీరాభిమానుల్లో  ఒకరైన మహమ్మద్ బషీర్ బొజాయ్  పాకిస్థాన్లోని కరాచీ కి చెందిన వాడు. అయితే ధోనీ మ్యాచ్ ఆడిన ప్రతిచోటా  క్రికెట్ స్టేడియంలో దర్శనం ఇస్తూ ఉంటాడు ఈ వీర అభిమాని. 2011లో జరిగిన ప్రపంచ కప్ లో  పాకిస్తాన్ భారత్ మధ్య పోరు చూసేందుకు బషీర్ కు టికెట్ దొరకకపోవడంతో అప్పుడు ధోని ఏకంగా అతనికి టికెట్ ఇప్పించాడు.




 అయితే తన అభిమాన ఆటగాడు  ధోని ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించడం తో తాను కూడా క్రికెట్ వీక్షణకు వీడ్కోలు పలుకుతాను అంటూ చెప్పుకొచ్చాడు బషీర్.  కరోనా  పరిస్థితులు చక్కబడ్డాక రాంచీ వచ్చి ధోని ని  కలుసుకుంటాను  అని చెప్పుకొచ్చారు. ఇక మహి ఆడడు  కాబట్టి మ్యాచ్ లను  చూసేందుకు నేను విదేశాలకు వెళ్ళను అంటూ చెప్పుకొస్తున్నాడు ఈ  అభిమాని. అయితే ఎంత గొప్ప ఆటగాడు  అయిన  ఏదో ఒక రోజు ముగింపు పలకాల్సిందే అని.., అతడి వీడ్కోలు నాకెన్నో మధుర స్మృతులను గుర్తుచేస్తుంది  అంటూ బషీర్ చెప్పుకొచ్చాడు, కాగా  అందరూ అభిమానులు కోరుకుంటున్నట్టు  గానే మహి వీడ్కోలు మ్యాచ్ ఆడి ఉంటే బాగుంటుంది అని వ్యాఖ్యానించాడు బషీర్.



 అయితే గతంలో చాలాసార్లు మహేంద్ర సింగ్ ధోనీ తో మాట్లాడే వాడినని  తెలిపిన బషీర్... 2019 నుంచి కుదరడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు, గత ప్రపంచ కప్ పోరులోనూ ధోని తనకు టికెట్ ఇప్పించడానికి గుర్తుచేసుకున్నాడు బషీర్. ధోనీ వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయాను అంటూ తెలిపాడు.  అయితే స్టేడియంలో ధోని కోసం చప్పట్లు కొడుతూ ఉన్నప్పుడు కొంత మంది పాకిస్తాన్ అభిమానులు తనను వెన్నుపోటు దారుడు అంటూ అవమానిస్తారని ఆవేదన వ్యక్తం చేసిన బషీర్... వాటిని పట్టించుకోను  అంటూ చెప్పుకొచ్చాడు, కాగా అటు ధోని అభిమానులు కూడా ధోని రిటైర్మెంట్ పై తీవ్ర నిరాశతో ఉన్న విషయం తెలిసిందే... ధోని ఒక వీడ్కోలు మ్యాచ్ ఆడి ఉంటే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అందరు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: