ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఇలా చేసి చూడండి..!

Divya
చాలామంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ,ఎన్ని పరీక్షలు రాసిన ఉత్తీర్ణులు కాక ఇబ్బంది పడుతూ ఉంటారు.వారితో పాటు ఉన్నవారు వారి వెనుక వచ్చిన వారు ఉద్యోగం తెచ్చుకొని, సంతోషంగా ఉంటే వీళ్లు వెనుకబడిపోతూ ఉంటారు. దానికి కారణం జన్మతహ దోషాలు ఉంటాయని,వాటికి పరిహారం చేసుకోవడం వల్ల గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం పరితపించేవారు, ఆంజనేయుడికి మల్లె పువ్వుల నూనెతో దీపాలు పెట్టడం వల్ల,తమ కోరిక నెరవేరుతుందని పురాణాలు చెబుతున్నాయి.ఆంజనేయుడికి ఆ దీపం ఎలా పెట్టి, ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందామా..
గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఆషామాషీ కాదు, దానికోసం ఎన్నో లక్షల మంది పరితపిస్తూ ఉంటారు. అందులో కొంతమందికి అవకాశం కలుగుతుంది.ఆ అవకాశం మనకి కలిగెంత వరకు హనుమంతుడు మన వెనుక నిలుస్తాడు.దీని కోసం ప్రయత్నించే వారికి చాలా ధైర్యం కావాలి.కావున ఆంజనేయుడికి మల్లెపూల దీపం పెట్టడం వల్ల,మనకి కొండంత బలం వచ్చి,మనోధైర్యం నిబ్బరం కలుగుతుంది.దీనికోసం శనివారం కానీ, మంగళవారం కానీ,దీపం పెట్టుకోవాలి.ఈ దీపం పెట్టుకోవాలి అనుకున్న రోజు ఇళ్ళు వాకిలి శుభ్రం చేసుకొని,పూజా మందిరాన్ని గోవు మూత్రంతో కానీ గోమయంతో కానీ పవిత్రం చేసి,కుబేర ముగ్గు వేసి ఆ తర్వాత పీఠం వేసి శ్రీరాముడి పటాన్ని ఉంచాలి.

ఆ తరువాత రాముడి కేదురుగా మరొక పీఠాన్ని వేసి, ఆంజనేయుడికి విగ్రహం కానీ,పటమును కానీ ఉంచుకోవాలి.ఆ పటాలకు పసుపు,కుంకుమ,పళ్ళు పూలను సమర్పించాలి.ఈ దేవుడు ముందు దీపం పెట్టడానికి  రెండు మట్టి ప్రమాదలను తీసుకొని, వాటికి పసుపు పూసి బొట్టు పెట్టి, ఒక దానిపై ఒకటి ఉంచుకోవాలి.అందులో మల్లెపువ్వు నూనె వేసి, 9 వత్తులు పెట్టి దీపం వెలిగించాలి.ఆ తర్వాత శ్రీరామ నామ జపాన్ని,ఆంజనేయ స్వామి అష్టోత్తర నామాన్ని జపిస్తూ మన కోరికను అర్జించుకోవాలి.ఇలా తొమ్మిది వారాలపాటు చేసుకోవడం వల్ల,మన కోరిక స్వామి వారు తప్పక విని గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేలా చేస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: