భారతదేశంలో ఉన్న ప్రముఖ వినాయక మందిరాలు ఇవే..!

Divya
వారంలో ప్రతి బుధవారం వినాయకుడికి అత్యంత శ్రేష్ఠం అయినట్టు గానే సంవత్సరానికి ఒకసారి వచ్చే వినాయక చవితికి కూడా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది . ఈ వినాయక చవితి రోజు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో ,ధూప దీప నైవేద్యాలను మహా గణాధిపతి సమర్పించి తమ కోరికలను తీర్చమని వేడుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే అంటే నేటి నుంచి నవరాత్రులు ప్రారంభం అవుతాయి.. కాబట్టి ప్రతి పట్టణం ,నగరం ,గ్రామం ,అలాగే వీధుల్లో కూడా వినాయక మండపాలు వెలసి భక్తులకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు మహాగణపతి.. మన భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత పొందిన వినాయక మందిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.
1. కాణిపాకం :
వినాయకుడి మందిరం అనగానే ప్రముఖంగా గుర్తుకు వచ్చే ప్రదేశం కాణిపాకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో కాణిపాకంలో వినాయక దేవాలయం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం చోళరాజు కులోత్తుంగ చోళ 1 నిర్మించారని చరిత్ర చెబుతోంది. రోజురోజుకు ఈ విగ్రహం ఎత్తు పెరుగుతుంది అని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఇక్కడ వినాయకుడు స్వయంభువుగా వెలసిన భావి కూడా ..ఎప్పుడు గంగమ్మ తల్లితో కలకలలాడుతూ ఉంటుంది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఈ దేవాలయం ఇక్కడ నిర్మించబడింది.
2. ఊచ్చీ పిల్లయార్ దేవాలయం:
ఈ దేవాలయం కేరళ రాష్ట్రంలోని తిరుచిరాపల్లి లో ఉన్న కోట పై విజయనగర సామ్రాజ్య రాజులు నిర్మించినట్లు తెలుస్తోంది. కావేరి నది తీరాన ఉన్న ఈ దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువనే చెప్పాలి.
3. గణపతిపూలే టెంపుల్:
ముంబై నుంచి సుమారుగా 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి సమీపంలో రత్నగిరి అనే ఒక ప్రదేశం ఉంది. ఇక్కడ గణపతిపూలే దేవాలయం దాదాపు 400 ఏళ్ల క్రితమే నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. అంతే కాదు ఇక్కడ పశ్చిమ ద్వారా దేవుడిగా గణపతిని కొలుస్తారు.
4. విఘ్నహార్ టెంపుల్:
పూణే నుండి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుకాడి నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయాన్ని నిర్మించారు.. అందమైన ప్రకృతి మధ్య కట్టిన ఈ గుడి పై చెక్కిన శిల్పాలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి.
ఇక వీటితో పాటు పూణేలో ఉన్న దగ్దుసేథ్ హల్వాయ్ గణపతి టెంపుల్ , ముంబై లో ఉన్న సిద్ధి వినాయక దేవాలయాలు భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: