మీకు రాత్రిపూట కలలో ఇవి కనిపిస్తున్నాయా... ?

VAMSI
జీవితంలో ఏది శాశ్వతం కాదని పెద్దవాళ్ళు అంటుంటారు. ఎంతోమంది ధనవంతులుగా మారి సంతోషంగా ఉంటే, మరికొందరు మాత్రం పేదవారుగా మిగిలి పోతారు. అయితే ఇలాంటి వారి అదృష్టం బాగా ఉండి దానికి కృషి తోడైతే పేదవారు సైతం ధనవంతులు కావడానికి ఎక్కువ కాలం పట్టదు. జీవితం అనే కాల చక్రంలో శాశ్వతమైనది ఏదీ లేదని ఎవ్వరూ ఎక్కువ కాలం ధనవంతుడు గానూ లేదా పేద వాడు గానూ శాశ్వతంగా ఉండిపోరని చెబుతుంటారు. ఇంకొంతమంది అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది అని మళ్ళీ అవకాశాలు మీ తలుపు తట్టవని అంటుంటారు. అయితే కలలు సాధారణంగా అందరికీ వస్తుంటాయి. మనకు ఒక్కోసారి వచ్చే కలలు కూడా మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టి ధనవంతులుగా చేస్తాయని కలల శాస్త్రం చెబుతోంది.

ఆ కలలేంటో ఒకసారి చూద్దాం. మీ కలలో కనుక నీటిలో తిరిగే తెల్లని పక్షి కానీ లేదా కొబ్బరికాయ  కానీ కనిపిస్తే చాలా మంచిది అని,  ధనలాభం ఉంటుంది అని కలల శాస్త్రం చెబుతోంది. త్వరలో మీకు ధన ప్రాప్తి కలగపోతోందని ఇది ఒక సంకేతం అని అంటున్నారు పండితులు. అలాగే కలలో కనుక పచ్చటి గడ్డి మేస్తున్న ఆవు కనుక కనిపిస్తే అదృష్టమే. లక్ష్మీ స్వరూపమైన గోవు కలలో కనిపిస్తే మనం త్వరలో ధనవంతులు కాబోతున్నామని అర్థం. కొంతమందికి కలలో తరచూ పాములు కనిపిస్తాయి అయితే ఇది అశుభ సూచకం కాదు. కలలో తెల్ల లేదా పసుపు పాము కనబడితే ఇంటిలోకి అనుకోకుండా ధనం వచ్చి చేరుతుందని అర్థం.


 అంతే కాకుండా మనం ప్రయాణం చేయడానికి బయలుదేరినప్పుడు లేదా బయటకు వెళ్లేటప్పుడు కనుక కోతి, పాము, పక్షి కుడివైపు నుంచి వస్తే మీకు త్వరలోనే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ధనవంతులుగా మారబోతున్నారని సంకేతాలుగా చెప్పబడుతున్నాయి.  ఇలా మీ కలలో పై విధమైన దృశ్యాలు కనిపిస్తే మీరు ధనవంతులుగా అవుతారని తెలుస్తోంది. ఇవి కేవలం పూర్వం పండితులు చెప్పిన విషయాలను బట్టే తెలుపుతున్నాము. నమ్మడం నమ్మకపోవడం అనేది పూర్తిగా మీ ఇష్టం మీదనే ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: