మనుషులంతా ఒకేలా పుడతారు. ఈ భువి పైకి అందరిలాగే కాలు మోపుతారు. అయితే వారి జీవితం మాత్రం వారి వారి అదృష్టాన్ని బట్టి ప్రాప్తాన్ని బట్టి కొందరు ధనవంతులు అవుతుంటారు, ఇంకొందరు మధ్యతరగతి జీవనం సాగిస్తుంటారు. మరికొందరు పేదరికంలో మగ్గి పోతుంటారు. అయితే జీవితమనే సాగరంలో ఏవీ శాశ్వతం కాదు. కొన్ని సార్లు ఓడలు బళ్ళు అవుతాయి. బళ్ళు ఓడలు అవుతాయి కానీ ఇది వారి యొక్క గుణ గణాలు, ఆలోచనా విధానం మరియు వారి ప్రవర్తించే వైఖరిపై ఆధారపడి ఉంటుంది. కొందరు ధనవంతులు అయ్యుండి కూడా స్వయంకృతాపరాధాలు వల్ల పేద వారిగా మారిపోతుంటారు. అందుకనే మనం చేసే పని ఏదైనా కాస్త ఆచితూచి చేయాలి.
ముఖ్యంగా భోజనం విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నది అందరికి తెలిసే ఉంటుంది. భోజనం విషయంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా అది
అన్నపూర్ణ మాతకు ఆగ్రహం కలిగించే ప్రమాదం ఉంది. కాబట్టి భోజనానికి సంబంధించిన అన్ని పనుల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. చాలామంది భోజనం విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. చాలామంది భోజనాన్ని మంచంపై కూర్చుని, కుర్చీలో కూర్చొని చాలా నిశ్చింతగా
టీవీ చూస్తూ చాలా నిదానంగా అన్నం తింటూ ఉంటారు. కానీ భోజనం మంచంపై కూర్చుని తినరాదు ఇలా చేయడం వలన
శ్రీ మహాలక్ష్మిని అవమానించినట్లే అవుతుంది , అదే విధంగా భోజనం చేసే సమయంలో మీ దృష్టి మొత్తం ఆహారంపైనే ఉండాలి తప్ప మరేదో విషయాలపై ఉండరాదు.
అది మనకు ఏ మాత్రం మంచిది కాదు. తినేటప్పుడు మన దృష్టి మొత్తం ఆహారంపైనే ఉండాలి. అప్పుడే మనకు అన్ని విధాలా కలిసివస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు ఆహారాన్ని గౌరవిస్తే మనకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందని చెబుతున్నాయి శాస్త్రాలు. మరికొందరు అన్నాన్ని చేత్తో గట్టిగా నలిపి నలిపి తింటూ ఉంటారు. ఇలా చేయరాదు
మహా ప్రసాదమైన అన్నాన్ని అలా నలప రాదు. ఇంకొందరు భోజనాన్ని మొదలుగా చేసుకుని బంతులు విసిరినట్లు నోట్లోకి అన్నం ముద్దలను విసిరి విసిరి మరి తింటారు. ఇలా చేయడం వల్ల దరిద్రం మన ఇంట్లో తాండవం చేస్తుంది. గుర్తుంచుకుని ఈ పొరపాట్లు జరుగకుండా చూసుకోండి.