మీరు సాయిబాబా భక్తులా ? ఇవి తెలుసుకోండి ?
గురువారం నాడు సాయిబాబా కు పండ్లు, పుష్పాలతో పాటు, కిచిడిని కానీ, హల్వాని కానీ నైవేద్యంగా సమర్పించినట్లు అయితే అద్భుత ఫలితాలను పొందవచ్చు. ఈ విధంగా చేస్తే మీరు ఋణ బాధల నుండి విముక్తి పొందవచ్చు అని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా మల్లెపూల మాలను కానీ, తులసిమాలను కానీ బాబా మెడలో వేయడం శ్రేష్టం. గురువారం నాడు చేసే దాన ధర్మాలు మనకు సిరిసంపదలు తెచ్చిపెడతాయి. గురువారం నాడు చేసే అన్నదానం మన పాపాలను తొలగిస్తుంది.
ఇవి ఏమీ ఇవ్వలేని, చేయలేని స్థితిలో మీరు ఉన్నా కూడా, పిడికెడు చక్కెర పెట్టి ఆ బాబాను భక్తి శ్రద్ధలతో వేడుకున్నా బాబా ఆశీర్వాదం మీకు తప్పక దొరుకుతుంది. ఆయన చల్లని అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. నమ్మి కొలిచే భక్తులకు ఎప్పుడూ నీడల్లే తోడు ఉంటాడు ఆ శిరిడి సాయి. "ఓం సాయి ... శ్రీ సాయి ... జయ జయ సాయి " అనే మంత్రాన్ని కూడా ఆయన ముందు పఠించడం చాలా అవసరం.