రోజూ 3 సార్లు రంగులు మారే శివలింగం.. ఎక్కడుందో తెలుసా?

VAMSI
అనంతమైన ఈ విశ్వంలో అంతుపట్టని వింతలు ఎన్నో ఉన్నాయి... అలాంటి వాటిలో ఒకటే రాజస్థాన్‌లోని దౌల్‌పూర్‌ లోని ఓ శివాలయం. ఈ దేవాలయం పేరు అచలేశ్వర మహాదేవ ఆలయం. అయితే ఈ దేవాలయంలో అంతుచిక్కని ఓ వింత నిత్యం జరుగుతోంది....ఇది సైన్సు కి కూడా అంతుపట్టడం లేదు. ఇంతకీ ఆ ప్రత్యేకమైన విశేషమేమిటంటే... ఆ శివుడు కొలువై ఉండే ఈ శివాలయంలో ఓ శివలింగం ఉంది. అయితే ఈ శివలింగం రోజుకు మూడు రంగులు మారుతూ దర్శనమిస్తుంది. అదేంటి శివలింగం రంగులు మారడం ఏంటి అనుకుంటున్నారా... అవును ఇది ఎంతో విచిత్రమైన వాస్తవమే. ఇక్కడి ఆలయంలోని శివలింగం రోజుకు మూడుసార్లు రంగులు మారుతుంది .

ఉదయం పూట తో ఎరుపు రంగులో, మధ్యాహ్నం  కాషాయరంగులో, రాత్రిపూట నలుపు రంగులోకి దాని అంతట అదే మారుతుంది. అయితే ఈ శివలింగం ఇలా మూడు పూటలా మూడు రంగుల్లో మారడానికి కారణం ఏమిటన్న విషయంపై ఎన్నో పరిశోధనలు జరిగినప్పటికీ ఎవ్వరికీ సమాధానం లభించలేదు. ఇది సాక్షాత్తు ఆ శివుడే సృష్టించిన వింతగా అందరూ  అంటున్నారు. ఈ ఆలయం 2,500 ఏళ్ల నాటిదిగా ఇక్కడి వారు చెబుతున్నారు.  ఎంతో మహిమగల శివలింగం ఉన్న ఆలయంగా ఈ శివాలయం ప్రసిద్ధి చెందింది. రాజస్థాని పాలరాళ్లతో రూపుదిద్దుకున్న ఈ దేవాలయం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. భక్తి శ్రద్ధలతో శివునికి ప్రత్యేక పూజలు జరిపితే మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రతీతి.

ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు  అన్ని శివాలయాల్లో అలాగే ఈ దేవాలయంలో కూడా ఎంతో అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుతారు. ఈ సమయంలో భక్త జనులు భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకొని... ఆ శివుని దర్శించుకుని తమ కోరికలు నెరవేర్చమని వేడుకుంటారు. ఇక్కడ మరో చిత్రమైన విషయం ఏమిటంటే.... ఈ శివాలయంలో సగం గుండ్రంగా ఉన్న ఓ చిన్న గొయ్యి  ఉంది. దీన్ని మహేశ్వరుడు  బొటనవేలు గా చెబుతుంటారు. కాగా ఇందులో నీళ్లు పోస్తే... ఆ నీరు వెంటనే మాయం అవుతుంది. మాయమైన నీరు ఎక్కడికి చేరుతోంది... ఇప్పటికి ప్రశ్నార్థకంగానే ఉంది. ఆ శివుని లీలలలో భాగమని ఒక నమ్మకం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: