శాకాంబరి పూర్ణిమ రోజు సాయంత్రం చేయాల్సిన పనులివే...?

VAMSI
మనము తర తరాలుగా అనుసరించే హిందువుల క్యాలెండర్ ప్రకారం శాకాంబరి పూర్ణిమ పుష్య మాసంలో రావడం జరిగింది. ఈరోజునే శాకాంబరి నవరాత్రులు మొదలవుతాయి. ఈ నవరాత్రి అష్టమి తిధి రోజున మొదలయి పుష్య మాసములో పూర్ణిమ రోజుతో ముగుస్తుంది. దుర్గం అనే రాక్షసుడిని సంహరించడంతో ఆ దేవికి దుర్గా దేవి అని పేరు పెట్టారు. అందుకే శాకాంబరి దేవిని సాక్ష్యాత్తు దుర్గా దేవి ప్రతిరూపమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ దేవతను ‘ది బేరర్ ఆఫ్ ది గ్రీన్స్' అని కూడా పిలుస్తారు. ఈ దేవత శాకాహార ఉత్పత్తులకు చాలా ప్రసిద్ధి అయిన దేవిగా భక్తులందరూ ఆరాధిస్తారు.

ఈ పూర్ణిమ రోజున కొన్నిపనులను చేయడానికి లేదు. అదే విధంగా కొన్నిపనులను మాత్రం తప్పకుండా చేయవలసి వస్తుంది. అవేమిటో తెలుసుకుందామా...? ఈ రోజున పవిత్ర స్నానం చేసి, అమ్మవారిని దర్శించుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ శుభ దినాన భక్తులంతా తప్పకుండా దానధర్మాలు చేయవలసి ఉంటుంది. అంతే కాకుండా శాకాంబరి దేవి విగ్రహాన్ని కూరగాయాలతో అలంకరించాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. పవిత్రమైన ప్రసాదాన్ని మాత్రమే శాకాంబరి దేవికి పెట్టాలి. అలా దేవతలు పెట్టిన ప్రసాదాన్ని కొంచెం సేపటి తరువాత భక్తులందరికీ పంచి పెట్టాలి.

అదే రోజున మీకు దగ్గరలో అమ్మవారి దేవాలయం ఉంటే తప్పక దర్శించి, ఆ దేవిని ఆరాధించాలి. మీకు శక్తికి మించినంత విరాళాన్ని దేవుని గుడికి ఇవ్వాలి.  ఈ విధంగా చేయడం వలన ఆ శాకాంబరి దేవి అనుగ్రహం మీ పైన ఉంటుంది.ఈ పూర్ణిమ రోజున పై విధంగా మీరు చేసినట్లయితే మీకు ఎటువంటి కష్టాలు ఉన్న కానీ అవన్నీ తీరిపోయి సుఖ శాంతులతో జీవిస్తారు. అంతే కాకుండా మీరు కోరుకున్న కోరికలన్నీ ఆ దేవి తప్పక తీరుస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇలా చేస్తే ఆ దేవత ఆశీర్వాదాలతో పాటు, వారి ఇళ్లలో శ్రేయస్సు పొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: