హెరాల్డ్ సెటైర్ : అన్నీ వైపుల నుండి చినబాబును ఓ ఆటాడుకుంటున్నారుగా ?
తాజాగా మరో మంత్రి కొడాలి నాని మాట్లాడుతు లోకేష్ లాంటి వేష్ట్ మనిషిని ఎక్కడా చూడలేదంటూ విరుచుకుపడ్డాడు. లోకేష్ ఎక్కడ తిరిగినా ఉపయోగం ఉండదని తిరిగిన చోటల్లా పిచ్చి మాటలు మాట్లాడితే జనాలే బుద్ధి చెబుతారంటూ కామెంట్ చేయటం వైరల్ గా మారింది. రైతులకు సంకెళ్ళు వేశారని చెప్పి తాను కూడా సంకెళ్ళు వేసుకున్న మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు జరిపినపుడు మరి తాను ఎందుకు కాల్చుకోలేదంటూ కొడాలి వేసిన ప్రశ్న సూటిటానే తగిలింది. పోలీసులపైన తిరగబడితేనే పోలీసులు వాళ్ళ చేతులకు బేడీలు వేసినట్లు పోలీసులు చెప్పిన విషయాన్ని కొడాలి గుర్తు చేశారు. ఎవరినీ ఉద్దేశ్యపూర్వకంగా తమ ప్రభుత్వం అవమానించటం జరగదన్నారు. అసలు రైతులకు బేడీలు వేసింది పోలీసులైతే ప్రతి విషయానికి ప్రభుత్వం అంటూ జగన్మోహన్ రెడ్డిని పిక్చర్ లోకి లాగం టీడీపీకి బాగా ఫ్యాషన్ అయిపోయిందంటూ మండిపడ్డారు.
మామూలుగా అయితే వైసీపీలో మంత్రులు కానీ సీనియర్ నేతలు కానీ లోకేష్ ను అసలు ఏమాత్రం లెక్కచేయరు. లోకేష్ ఎక్కడ పర్యటించినా ఎవరితో ఏమి మాట్లాడినా పెద్దగా విలువివ్వరు. మంత్రి అనీల్ మాట్లాడుతూ లోకేష్ మాట్లాడితే టీడీపీ నేతలు పెద్దగా సీరియస్ గా తీసుకోరని ఇక తామెందుకు పట్టించుకుంటామంటూ బొత్తిగా తీసిపారేశారు. మొన్నటికొ మొన్న కందిపప్పు తినటమే కానీ అది ఎలా పండుతుందో కూడా తెలీదంటూ లోకేష్ ను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. కారణాలు ఏవైనా కానీండి రెండు రోజులుగా లోకేష్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను, ఆరోపణలను మంత్రులు ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నారు. మంత్రులు అదే పనిగా లోకేష్ ను టార్గెట్ చేసుకోవటం చూస్తే ఏదో వ్యూహాత్మకంగానే మాటలతో దాడులు చేస్తున్నట్లు అనుమానంగా ఉంది.