హెరాల్డ్ సెటైర్ : జగన్ లేఖ తర్వాత న్యాయవాదుల్లో చీలిక ? ఎల్లోమీడియా పుణ్యమేనా ?
సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు మరో ఆరుగుగు జడ్జీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశ్యపూర్వకంగా వ్యవహరిస్తున్నట్లు జగన్ తన లేఖలో ఆరోపించారు. వీరంతా చంద్రబాబునాయుడు ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తన లేఖలో ఆధారాలను కూడా అందించారు. నిజానికి జగన్ రాసిన లేఖలోని అంశాలు తప్పా ? ఒప్పా ? అని తేల్చాల్సిందే బాబ్జే మాత్రమే. అయితే ఆశ్చర్యంగా జగన్ చేసిన ఫిర్యాదుతో ఎటువంటి సంబంధం లేని బార్ అసోసియేషన్ కార్యదర్శి రోహిత్ పాండే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. దీన్ని ఇఫుడు ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయవాది, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దవే తీవ్రంగా ఖండించారు. జగన్ కు వ్యతిరేకంగా ఢిల్లీ బార్ అసోసియేషన్ సమావేశంలో తీర్మానం చేయటాన్ని దవే వ్యతిరేకించారు. ’జగన్ రాసిన ఆరోపణల్లోని అంశాలపై మనకు ఏమి తెలుసని ఖండించారం’టూ మండిపోయారు. ’లేఖలోని ఆరోపణలపై విచారణ జరిపితేనే వాస్తవాలు ఏమిటో బయటపడతాయన్న దవే, జగన్ కోరుకుంటున్నది కూడా ఇదే కదా’ అంటూ నిలదీశారు.
సుప్రింకోర్టుతో పాటు న్యాయవ్యవస్ధపైన ఉన్న అనేక ఆరోపణలను దవే గుర్తుచేశారు. ఎప్పుడు ఆరోపణలు వచ్చినా ఏదో రూపంలో సర్దుబాటు చేయటం తప్ప నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రకటించలేదన్నారు. అన్నీ వ్యవస్ధలోకి పారదర్శకత లేని వ్యవస్ధ ఏదన్నా ఉంటే అది న్యాయవ్యవస్ధ మాత్రమే అంటు బార్ అసోసియేషన్ కు ఘాటుగా లేఖ రాశారు. ఇదే సందర్భంలో జగన్ రాసిన లేఖపై సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ వెంటనే విచారణ చేయాలని డిమాండ్ చేయటంతో బార్ అసోసియేషన్ తో పాటు ఢిల్లీ, సుప్రింకోర్టులో సంచలనంగా మారింది. జగన్ రాసిన లేఖ విషయంలో కార్యదర్శి రోహిత్ పాండే-అధ్యక్షుడు దుష్యంత్ దవే వర్గాలుగా న్యాయవాదులు చీలిపోయారట. రోహిత్ రాసిన లేఖను వ్యతిరేకిస్తున్న వారంతా దవే వైపు చేరుతున్నట్లు సమాచారం.