హెరాల్డ్ సెటైర్ : పాపం ఈ ఎంపి నోరు కట్టేసినట్లేనా ? తట్టుకోలేకపోతున్నాడా ?
కానీ ఏడాది తిరిగేసరికి సీన్ మొత్తం రివర్సయిపోయింది. చాలా అంశాల్లో సుజనా మాటకు విలువ లేదని తేలిపోయింది. ఎలాగంటే రాష్ట్రంలో జరిగే చాలా విషయాలకు అసలు సుజనాకు సంబంధం లేదన్నట్లుగా బిజెపి అగ్రనాయకత్వం తేల్చేసింది. మూడు రాజధానుల విషయం, శాసనమండలి రద్దు విషయాల్లో అయితే సుజనా చాలా ఓవర్ యాక్షనే చేశాడు. రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నంత వరకు ప్రతి విషయంలోను ఎగిరెగిరిపడిన సుజనా అధ్యక్షునిగా సోము వీర్రాజు రాగానే చప్పపడిపోయాడు. సుజనా చెప్పే ప్రతిమాటకు ఢిల్లీ నుండి మరో రాజ్యసభ ఎంపి, దక్షిణాధి రాష్ట్రాల అధికారప్రతినిధి జీవిఎల్ నరసింహారావు అప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చేశాడు. ఓ రకంగా సుజనా గాలిని జీవీఎల్ తీసేశాడనే చెప్పాలి. చివరకు సోము రాకతో దాదాపు నోరు మూతపడిపోయినట్లే అనుకోవాలి. ఎందుకంటే సోము కొత్త అధ్యక్షునిగా అపాయింట్ అయిన దగ్గర నుండి సుజనా నోరెత్తటమే లేదు. చివరకు వీర్రాజు బాధ్యతలు తీసుకునే సందర్భంలో కూడా కనబడలేదు.
తాజాగా రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్న విషయం ఏమిటంటే పార్టీ పరంగా సుజనాను ఏపి రాజకీయాల నుండి తప్పించారట. ఇక నుండి ఏపి రాజకీయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవద్దని స్పష్టంగా పార్టీ అగ్ర నాయకత్వం చెప్పేసిందట. అందుకనే తాజా వివాదం టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎక్కడా నోరిప్పటం లేదు. నిజానికి సుజనా టిడిపిలో నుండి బిజెపిలోకి ఫిరాయించిందే ప్రత్యేకమైన టార్గెట్ తో. అదేమిటంటే కేంద్రంలోని అధికారపార్టీలో ఉంటు చంద్రబాబునాయుడు ప్రయోజనాలను కాపాడటం. చంద్రబాబుకు వ్యతిరేకంగా కేంద్రం కేసులను తిరగతోడకుండా చూడటమే ప్రధాన బాధ్యతగా ప్రచారంలో ఉంది. పనిలో పనిగా తనమీదున్న కేసులు కూడా కోల్డు స్టోరేజీలో ఉంచేయటం కూడా అవసరమే లేండి. ఏ కారణంతో అయితే పార్టీ ఫిరాయించాడో ఆ అవసరం సుజనాకు ఇంతవరకు వచ్చినట్లు లేదు.