హెరాల్డ్ సెటైర్ : టిడిపి చివరకు చంద్రబాబు వల్లే ముణిగిపోతుందా ?

Vijaya
క్షేత్రస్ధాయిలో జరుగతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  అధికారంలో ఉన్నపుడు చేసిన ఓవర్ యాక్షన్ ఫలితంగానే సొంత సామాజికవర్గంపై  మిగిలిన సామాజికవర్గాల్లో ఒక విధమైన వ్యతిరేకత వచ్చేసింది. ఈ విషయం ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ నిర్వహించుకున్న సమీక్షల్లో కొందరు నేతలు బాహాటంగానే ప్రస్తావించిన  విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. సరే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతయినా పద్దతి మార్చుకున్నారా అంటే లేదు. పైగా సమాజాన్ని కులాల వారీగా చీల్చేందుకు సర్వకాల సర్వావస్తల్లో తనకు అండగా ఉండే ఎల్లోమీడియా ద్వారా చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా విజయవాడలోని స్వర్ణా ప్యాలెస్ కరోనా కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో అర్ధమైపోతోంది. కేవలం కుల ప్రాతిపదికన మాత్రమే ఆసుపత్రి యజమాని డాక్టర్ పోతినేని రమేష్ చౌదరిని కాపాడేందుకు చంద్రబాబుతో పాటు యావత్ పచ్చబ్యాచ్ మొత్తం డాక్టర్ చుట్టూ  మోహరించేసింది.




అసలు సమస్యను సమస్యగా చూసే తత్వం చంద్రబాబులో లోపించిందనే విషయం అర్ధమైపోతోంది. కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది చనిపోయారన్నది వాస్తవం. ఈ సెంటర్ రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం పోతినేని రమేష్ చౌదరి ఆధీనంలో ఉందన్నది కూడా నిజమే. కాబట్టి డాక్టర్ ను డాక్టర్ గాను ప్రమాదాన్ని ప్రమాదంగా చూడాలి. కానీ చంద్రబాబు, ఎల్లోబ్యాచ్ మాత్రం డాక్టర్ ను కమ్మ సామాజికవర్గంలో ప్రముఖునిగా చూడటంతోనే సమస్య పెరిగిపోయింది. డాక్టర్ మీద చర్యలు తీసుకుంటే యావత్ కమ్మ సామాజికవర్గం మీద ప్రభుత్వం వేధింపులకు దిగుతోందంటూ నానా గోల చేస్తున్నారు. ఇదే రమేష్ ఆసుపత్రికి ప్రభుత్వం కరోనా వైరస్ చికిత్సకు సంబంధించిన రీ ఎంబర్స్ మెంటు నిధులను మంజూరు చేసిన విషయాన్ని చంద్రబాబు అండ్ కో మరచిపోయినట్లుంది. విజయవాడలోనే ఉన్న మరికొన్ని కమ్మ డాక్టర్ల నేతృత్వంలో పని చేస్తున్న కరోనా సెంటర్లకు ఇవ్వాల్సిన నిధులను కూడా ఇచ్చేస్తోంది.




నిధుల మంజూరులో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని చంద్రబాబు ఆరోపిస్తే అర్ధముంది. అంతేకానీ జరిగిన ప్రమాదంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అనుకుంటే దాన్ని కూడా సామాజికవర్గం కోణంలో చూడటం చంద్రబాబు, ఎల్లో బ్యాచ్ కే చెల్లింది. ప్రమాదానికి డాక్టర్ రమేష్ కు సంబంధమే లేదని యావత్ ఎల్లో బ్యాచ్ అడ్డుగోలుగా వాదిస్తోంది.  మరి ఇదే సూత్రం వైజాగ్ ఎల్జీ కంపెనీ విషయంలో ఎందుకు వర్తింపచేయలేదు. ఎల్జీ కంపెనీలో ప్రమాదం జరిగి 10 మంది చనిపోయారు. వెంటనే యాజమాన్యంపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయాలంటూ చంద్రబాబు, ఎల్లోమీడియా ఎంత యాగీ చేసిందో అందరు చూసిందే. అక్కడేమో బాధితులకు ప్రభుత్వం అండగా ఉండటం లేదని గోల చేసిన చంద్రబాబు అండ్ కో విజయవాడ ఘటనలో మాత్రం యాజమాన్యానికి మద్దతుగా మాట్లాడుతుండటమే విచిత్రంగా ఉంది. కేవలం డాక్టర్ రమేష్ మీద చర్యలు తీసుకోకూడదనే వాదిస్తున్న చంద్రబాబు అండ్ కో అంటే జనాల్లో వ్యతిరేకత వచ్చేస్తున్నా లెక్క చేయటం లేదు.




ఆమధ్య వైజాగ్ జిల్లాలోని నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ ఆరోపణలు చేస్తే ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. నిజానికి వివాదం చాలా చిన్నది. దాన్ని సుధాకర్, ప్రభుత్వం పరిష్కరించుకునేదే. కానీ చంద్రబాబు, ఎల్లోమీడియా జోక్యం చేసుకుని దాన్ని ఎస్సీల మీద ప్రభుత్వం వేధింపులుగా మార్చేశారు. దాంతో వివాదం బాగా పెరిగిపోయింది. ప్రభుత్వ సర్వీసులో ఉన్న వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదన్నది నిబంధన. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన కారణంగా కొందరిని సస్పెండ్ చేసిన ఘటనలున్నాయి.  ఇక చిత్తూరు జిల్లాలో మరో డాక్టర్ అనితారాణి వివాదంలో కూడా చంద్రబాబు అండ్ బ్యాచ్ జోక్యం చేసుకుని కంపు చేసేసింది. పై ఇద్దరు డాక్టర్ల వివాదంలో వీళ్ళు జోక్యం చేసుకుని ప్రభుత్వం ఎస్సీలను వేధిస్తోందనే కలరింగ్ ఇచ్చేందుకు ఎంత  ప్రయత్నించినా సాధ్యం కాలేదు.




 అలాగే సస్పెన్షన్ లో ఉన్న జడ్జి రామకృష్ణ-జస్టిస్ ఈశ్వరయ్య వివాదాన్ని రోడ్డున పడేసి ప్రభుత్వం ఎస్సీలను వేధిస్తోందని విపరీతమైన ప్రచారం చేసింది ఇదే ఎల్లోబ్యాచ్. పనిలో పనిగా బిసిలకు వైసిపి ప్రభుత్వం వ్యతిరేకమనే విధంగా చేసిన ప్రయత్నం కూడా అందరికీ తెలిసిందే.  జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎస్సీలు, బిసిలను విడదీసేందుకు ఎల్లోబ్యాచ్ విపరీతంగా శ్రమిస్తోంది. సమాజాన్ని కులాలవారీగా తాము విడదీస్తు జగన్ విడదీస్తున్నాడంటూ ఎదరుదాడులు చేస్తుండటమే విచిత్రంగా ఉంది. సమస్యను సమస్యగా చూడటం మానేసిన చంద్రబాబు, ఎల్లో బ్యాచ్ ప్రతి విషయంలోను కులాలను రచ్చలోకి ఈడుస్తోంది. జరుగుతున్నది చూస్తుంటే చివరకు అన్నీ సామాజికవర్గాలు కలిసి టిడిపికి మరోమారు గూబ పగలగొట్టడం తప్పదనే అనిపిస్తోంది. అంటే తాను నమ్ముకున్న సామాజికవర్గ రాజకీయమే చివరకు భస్మాసుర హస్తం అయ్యేలాగనిపిస్తోంది.







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: